వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై, టీడీపీ అధినేత.. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశాడు విజయసాయి రెడ్డి. ఎప్పుడు దత్తపుత్రుడు అంటూ కామెడీ చేసే విజయసాయి రెడ్డి ఈరోజు యాక్టర్ నిమిత్త పాత్రుడు మాత్రుడు అంటూ ట్విట్టర్ వేధికగా సెటైర్లు వేసి నెటిజన్ల ముఖాల్లో నవ్వులు పూయిస్తున్నాడు.

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ''యాక్టర్ నిమిత్త మాత్రుడు. నడిపించేది, వెనక నుంచి నెట్టేది, డైరెక్ట్ చేసేది, స్క్రిప్ట్ చేతి కందించేది, పేమెంట్ ఇచ్చేది యజమాని స్థానంలో ఉన్న 40 ఇయర్స్ ఇండస్ట్రీనే. కమ్మూనిస్టులతో కలిసినా, బిఎస్పీ కాళ్లు పట్టుకున్నా, కమలం వైపు కదిలినా ఆదేశించేది ఆయనే.'' అంటూ సంచలన ట్విట్ చేశాడు విజయసాయి రెడ్డి. 

 

అయితే నిన్ననే బీజేపీ-జనసేన పార్టీలు కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నాయి. స్థానికం నుంచి సార్వత్రిక ఎన్నికల వరకూ కలిసి పోటీ చేయాలని ఆ పార్టీలు డిసైడ్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి ఈ ట్విట్ చేశారు. ఈ ట్విట్ చుసిన నెటిజన్లు స్క్రీన్ షాట్లు తీసి వాట్సాప్ లో స్టేటస్ లు పెడుతున్నారు.. షేర్లు చేస్తున్నారు. ఇంకా ట్విట్టర్ లో అయితే కామెడీ కామెడి ఫోటోలు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి ట్విట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: