వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశాడు విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశాడు విజయసాయి రెడ్డి. ఎప్పుడు దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ పై జోకులు వేసే విజయసాయి రెడ్డి ఈరోజు యాక్టర్ నిమిత్త పాత్రుడు మాత్రుడు అని ఒక ట్విట్ చెయ్యగా.. మరో ట్విట్ లో విజయసాయి రెడ్డి ఓ గుండు సున్నా అంటూ ట్విట్ చేశారు. 

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. గుండు సున్నా దేనితోనైనా కలిసినా, విడిపోయినా ఫలితం జీరోనే. సున్నాను తలపైన ఎత్తుకున్నా, చంకలో  పెట్టుకున్నా జరిగేదదే. ఇది పదేపదే నిరూపితమవుతూనే ఉంటుంది. అయినా ప్రయోగాలకు సాహసించే వారు ప్రయత్నిస్తూనే ఉంటారు. దెబ్బతింటుంటారు. మనం పాపం అనుకుంటూ వదిలేయాలి'' అంటూ ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి.  

 

ఈ సెటైర్స్ చూసి నెటిజన్లు.. వ్యంగ్యాస్థ్రాలు సంధిస్తున్నారు. ఈ జీరోకి అప్పుడే పార్టీ బరువు అయిపోయిందా ? అని ఒకరు ట్విట్ చేస్తే.. మరికొందరు.. అప్పుడు ఎప్పుడో చావనైనా చస్తాం కానీ బీజేపీలోకి విలీనం చెయ్యము అన్నారు.. ఇప్పుడు ఏంటి ఇది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు.. మరికొందరు స్పందిస్తూ.. నిజమే కదా.. గుండు సున్నా దేనితో కలిసిన జీరోనే.. కదా అని కామెంట్ చేస్తున్నారు. దీంతో విజయసాయి రెడ్డి ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: