పవర్ కమిటీ ఉత్తుత్తి కమిటీ అని, అదొక పవర్లేని కమిటీ అనేది మరోసారి స్పష్టమైందని, ప్రజాభిప్రాయసేకరణ పేరుతో రాజధాని రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామని, ఆన్లైన్లో వివరాలు ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వం, అభిప్రాయాలు వెలువరించే ఆన్లైన్సైట్ పనిచేయకుండా చేసిందని, టీడీపీ అధికారప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. ఏదడిగినా తమకేమీ తెలియదని చెబుతున్న మంత్రులు ఎందుకు తమపదవుల్లో కొనసాగుతున్నారో చెప్పాలన్నారు.
జగన్మోహన్రెడ్డి నవ్వుతూనే, ప్రజలకళ్లలో కారం కొడుతున్నాడని వెంకన్న మండిపడ్డారు. మంత్రులకు తమశాఖలపై పట్టులేదని, అందుకే వారెవరూ ప్రజలముందుకు రావడంలేదన్నారు. ముఖ్యమంత్రి ఇష్టానుసారం వ్యవహరిస్తుంటే మంత్రులంతా మూగనోము పట్టారన్నారు. రాజధాని రైతులు తమసమస్యలు చెప్పుకోవడానికి వస్తే, అక్కడ ఏవిధమైన ఏర్పాట్లుచేయకపోగా, పనిచేయాల్సినవికూడా చేయకుండా చేశారన్నారు.
క్యాష్లైన్ తప్ప, ఆన్లైన్గురించి తెలియని మంత్రులు రాజధాని రైతులవద్దకు వెళ్లి ఎందుకు అభిప్రాయాలు తీసుకోలేద ని బుద్దా ప్రశ్నించారు. ప్రజల అభిప్రాయాలను ఈ-మెయిల్, ఆన్లైన్ద్వారా చెప్పాలంటున్న ప్రభుత్వం, ఓట్లనుకూడా అదేపద్ధతిలో అడిగి ఉంటే, ప్రజలు దిమ్మతిరిగే లా సమాధానం చెప్పివారన్నారు. రైతుల ముందుకు వెళ్లే ధైర్యంలేక, ముఖంచెల్లకనే జగన్ ఆయనమంత్రివర్గం ఆన్లైన్పేరుతో నాటకాలాడుతోందన్నారు.
రాష్ట్రచరిత్రలో ప్రజల్ని ఇంతలా మోసగించిన ప్రభుతాన్ని ఇప్పటివరకు చూడలేదన్నారు. సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలియని మంత్రులంతా, ప్రజల కళ్లలో కారంకొడుతూ, వారిని మోసగించాలనే ఆలోచనలో ఉన్నారన్నారు. 20వతేదీన నిర్వహించాల్సిన కేబినెట్ సమావేశాన్ని అత్యవసరంగా నేడు (18వతేదీన) ఎందుకు నిర్వహించాల్సి వచ్చిం దన్నారు. కేబినెట్సమావేశంలో జగన్ నోటినుంచి ప్రజా వ్యతిరేకనిర్ణయం వెలువడిన మరుక్షణం, రాష్ట్రం అగ్నిగుండమవుతుందని, ప్రజలంతా ఉప్పెనలా విరుచుకుపడి, వైసీపీప్రభుత్వాన్ని ముంచేస్తారని వెంకన్న హెచ్చరించారు. ఇప్పటికే రాజధాని ప్రజలు వైకాపాపై గుర్రున ఉన్నారు. ఒకవేళ అనుకున్నట్టుగానే రాజధాని మార్పు జరిగితే వైకాపాకు ఇదే ఆఖరు అవకాశం అవుతుంది. రాజకీయాలను పక్కన పెట్టి రైతులు దాడులు చేయడం గ్యారెంటీగా జరుగుతుంది.