సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ తమ రాజకీయ ప్రత్యర్థులపై పంచ్ డైలాగులతో ట్విట్స్ పెట్టే విజయ సాయి రెడ్డి ఆ ట్విట్ల ద్వారానే తాను చెప్పాల్సింది చెబుతూ దడ పుట్టిస్తుంటారు. పార్టీ అధికారంలో లేనప్పుడే కాకుండా ఇప్పుడు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ పంచ్ డైలాగుల తో విజయసాయి రెడ్డి విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఏపీలో బిజెపి, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిపై విజయసాయి రెడ్డి స్పందించారు. నేరుగా బీజేపీ పేరు ప్రస్తావించకపోయినా జనసేన బిజెపి రెండు పార్టీలను పరోక్షంగా విమర్శిస్తూ ఆయన ట్వీట్ చేశారు.
గుండు సున్నా దేనితోనైనా కలిసినా విడిపోయినా ఫలితం జీరో అని సున్నాను తల పైకి ఎత్తుకున్నా సంకన పెట్టుకున్నా జరిగేది ఇదేనని పదే పదే నిరూపితం అవుతూనే ఉంటుంది. అయినా ప్రయోగాలకు సాహసించేవారు ప్రయత్నిస్తూనే ఉంటారు. దెబ్బ తింటూ ఉంటారు మనం పాపం అనుకుంటూ వదిలేయాలి అంటూ విజయ సాయి రెడ్డి ట్విట్ పెట్టారు. దీనిపై పవన్ సోదరుడు నాగబాబు స్పందించారు. సున్నా విలువ తెలియని వారికి మనం ఏం చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఊడినట్టే. ఈరోజు సైన్స్ అండ్ మాథ్స్, అండ్ కంప్యూటర్స్ ఇంత డెవలప్ అయ్యింది అంటే సున్నా మహత్యమే రా ! చదువుకున్న జ్ఞానంలేని సన్నాసుల్లారా అంటూ తీవ్రపదజాలంతో నాగబాబు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు.
అయితే ఎంత పరుష పదజాలంతో నాగబాబు ఈ విధంగా ట్విట్లు పెట్టడంపై జనాలు మండిపడుతున్నారు. రాజకీయాల్లో విమర్శలు అనేవి సర్వ సాధారణం అని విధానపరంగా విమర్శించుకున్నా ఫర్వాలేదు కానీ అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలు సరికాదంటూ నాగబాబుకి సూచిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా బీజేపీ జనసేన పార్టీల పొత్తు పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ అంశమే ఏపీ రాజకీయాల్లో హాట్ టాఫిక్ గా మారింది.
గుండు సున్నా దేనితోనైనా కలిసినా, విడిపోయినా ఫలితం జీరోనే. సున్నాను తలపైన ఎత్తుకున్నా, చంకలో పెట్టుకున్నా జరిగేదదే. ఇది పదేపదే నిరూపితమవుతూనే ఉంటుంది. అయినా ప్రయోగాలకు సాహసించే వారు ప్రయత్నిస్తూనే ఉంటారు. దెబ్బతింటుంటారు. మనం పాపం అనుకుంటూ వదిలేయాలి
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 17, 2020
యాక్టర్ నిమిత్త మాత్రుడు. నడిపించేది, వెనక నుంచి నెట్టేది, డైరెక్ట్ చేసేది, స్క్రిప్ట్ చేతి కందించేది, పేమెంట్ ఇచ్చేది యజమాని స్థానంలో ఉన్న 40 ఇయర్స్ ఇండస్ట్రీనే. కమ్మూనిస్టులతో కలిసినా, బిఎస్పీ కాళ్లు పట్టుకున్నా, కమలం వైపు కదిలినా ఆదేశించేది ఆయనే.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 17, 2020
జీరో విలువ తెలియని వెధవలకి మనం ఏం చెప్పినా చెవిటి వాడి ముందు శంఖమ్ వూదినట్లే. ఈ రోజు సైన్స్ అండ్ మాథ్స్ అండ్ కంప్యూటర్స్ ఇంత డెవెలప్ అయ్యాయి అంటే సున్నా మహత్యమేరా చదువుకున్న జ్ఞానం లేని సన్నాసుల్లారా
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 17, 2020
అదిరింది ద్వారా నాకు జబర్దస్త్ లోటు తీరింది.అంబటి ,పేర్ని,అనిల్,అవంతి,మొదలైన లీడర్స్ వల్ల ఎక్స్ట్రా జబర్దస్ట్ లోటు తీరింది.ఇంకా అదిరింది కామెడీ షో పార్ట్ 2 అవసరం లేదేమో అనిపిస్తోంది.
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 17, 2020