మహిళలపై ఇటీవల కాలంలో అత్యాచారాలు విపరీతంగా జరుగుతున్నాయి. గత కొంతకాలంగా జరుగుతున్న అత్యాచారాలు దేశంలో ఎక్కువైపోయాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరిని కూడా కామాంధులు వదలడం లేదు. కామంతో రెచ్చిపోతున్నారు. వారిని రేప్ చేస్తున్నారు. అభం శుభం తెలియని పిల్లలను సైతం వదలకుండా అఘాయిత్యాలకు పాల్పడుతుండటంతో దేశంలో పిల్లల పరిస్థితి దారుణంగా మారిపోయింది.
ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. ఇటీవలే మెక్సికోలోని చియాఫస్ అనే చోట ఈ సంఘటన చోటు చేసుకుంది. చియాపస్ లో ఆరేళ్ళ చిన్నారిని ఓ వ్యక్తి అఘాయిత్యం చేశాడు. ఆ చిన్నారిని చంపి గుట్టల్లో పడేసి వెళ్ళిపోయాడు. చిన్నారి కోసం తల్లిదండ్రులు ఊరంతా గాలించారు. చివరకు ఆ చిన్నారి శవం పొలిమేరలో కనిపించింది. పొలిమేరలో చిన్నారి విగతజీవిగా కనిపించడంతో షాకైన ఆ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అయితే, ఆ పక్కనే ఉన్న గ్రామస్తులు చిన్నారిపై అత్యాచారం చేసినట్టుగా అనుమానిస్తున్న వ్యక్తిని పట్టుకొని చితక్కొట్టారు. అక్కడితో ఆగలేదు. పోలీసులు వచ్చే సరికే అతడిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. దీంతో సదరు వ్యక్తి మరణించాడు. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. ఎవరు హత్యచేశారో తెలియకపోవడంతో ఎవరికీ ఏమి అర్ధం కాలేదు. పోలీసులు అందరిని అడిగి చూశారు.
ఎవరూ కూడా సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అనుమానాస్పద కేసు కింద పోలీస్లు కేసు నమోదు చేసుకున్నారు. అయితే, ఆ వ్యక్తి చిన్నారిపై అత్యాచారం చేసినట్టుగా అనుమానించారు అంతే. ప్రూవ్ కాలేదు. కానీ, ఆ అనుమానంతోనే సదరు వ్యక్తిని గ్రామస్తులు కొట్టి పెట్రోల్ పోసి హత్య చేశారు. ఎవరు చంపారు ఏంటి అనే విషయం మాత్రం బయటకు రావడం లేదు. అత్యాచారం చేసిన వాళ్లకు ఇదే సరైన శిక్ష అని అంటున్నారు అక్కడి ప్రజలు.