ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏదోక విషయంలో ఇటు టీడీపీ ప్రభుత్వం అటు మెగా కుటుంబం టార్గెట్ చేస్తూ వస్తున్న సంగతి అయితే మొదటి నుండి జనసెన నాయకుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే..కాగా ఇప్పుడు కొత్తగా మెగా బ్రదర్ నాగబాబు ట్రైల్స్ వేస్తూ వస్తున్నాడు..

 

 

నాగ బాబు మాట్లాడుతూ..అమరావతి అంశాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర ట్వీట్లు చేశారు. తప్పులులు సరిదిద్దుకోవాలని సూచించారు.. ఎమ్మెల్యేలను కంట్రోల్‌లో పెట్టుకోవాలని.. 'కనీసం మీ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిలా ఉండడానికి ప్రయత్నించండి' అంటూ నాగ బాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రచ్చ చేస్తున్నాయి..

 

 

డియర్ జగన్ రెడ్డిగారు.. ఇది నా రిక్వెస్ట్.. ప్లీజ్ మీ తప్పుల్ని సరిద్దుకోండి. వచ్చే నాలుగున్నరేళ్లు పాలన కొనసాగించాలి అన్నారు.. అలాగే 151మంది ఎమ్మెల్యేల బలం ఉందని గుర్తు చేశారు. 'మీరు సుపరిపాలన అందించాలనుకుంటే.. రాష్ట్రాన్ని గందరగోళంలో పడేయొద్దు.. మీరు గందరగోళపడొద్దు.. ఇది తన రిక్వెస్ట్ అని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు..తప్పుల్ని సరిచేసుకునేందుకు సమయం ఉంది. మీరు తప్పులు చేయాలని మేము అనుకోము.. వాటి నుంచి మేము ప్రయోజనాలు పొందాలి అనుకోము.. జనసేన పార్టీకి అలాంటి ఆలోచనలు చేయదు. మీ ఎమ్మెల్యేలను మీరు కంట్రోల్ చేసుకోండి.. వారు మీ విజయాన్ని నాశనం చేస్తున్నారు’అంటూ మరో ట్వీట్ చేశారు.

 

గత కొద్దిరోజులుగా నాగబాబు ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తున్నారు. అమరావతి రైతుల ఆందోళనలు, కాకినాడలో జనసేన పార్టీ నేతలపై దాడి జరిగిందంటూ స్పందిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల తీరుపై మండిపడ్డారు. అలాగే జనసేన-బీజేపీ పొత్తుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు... ప్రస్తుతం ఆ ట్వీట్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి..

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: