ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు కోపం వచ్చిందట. అది కూడా ఓ ఫ్లెక్సీ విషయంలో. ఆ ఫ్లెక్సీ ఎవరిదో కాదు జూనియర్ ఎన్టీఆర్ ది. ఇప్పటికే జనసేన అధినేత బీజేపీ అగ్రనేతలతో భేటీ కావడం.. ఆ పార్టీతో చెట్టాపట్టాలు వేసుకునేందుకు తిరిగేందుకు సిద్ధమవడం, తమ పార్టీల నేతలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్న సంకేతాలు వస్తుండటంపై ఆయన ఒకింత అసహననానికి గురవుతున్నారట. పుండు మీద కారం చల్లినట్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫ్లెక్సీ విషయంపై చంద్రబాబు గరంగరంగా ఉన్నట్టు సమాచారం. 

 

ప్రకాశం జిల్లాలో ఓ ఫ్లెక్సీ వెలిసింది. అందులో ఏముందంటే..!  రాబోయే కాలానికి కాబోయే సీఎం అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ కొలువుదీరింది. నూతన సంవత్సరంతో పాటు.. సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ ఫ్లెక్సీ కనిపించింది. అంతేకాదు 2024లో ఆయనే ముఖ్యమంత్రి అంటూ అందులో తాటికాయంత అక్షరాలతో పొందుపరిచారు. దీనిపై చంద్రబాబుకు యమా కోపం వచ్చిందట. ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన తమ పార్టీ నేతలకు గట్టిగా క్లాస్ పీకడంతో పాటు ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఇంకోసారి ఇలాంటి పనులు రిపీటైతే.. పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారట.


ఇటీవల చంద్రబాబు వయసు గురించి చాలా చర్చే జరిగింది. ఆయన తర్వాత పార్టీని నడిపించేది ఎవరు అనే సందేహాలు సొంత పార్టీలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తన కొడుకు లోకేశ్ టీడీపీ అధినేత కావాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ పై ఫ్లెక్సీపై రగిలిపోతున్న టీడీపీ అధినేత.. నిజంగా సొంత పార్టీలో తిరుగుబాటు వస్తే ఏంచేస్తారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే సదరు వ్యక్తులు పార్టీ కార్యకలాపాలను జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగిస్తే బాగుంటుందని భావిస్తున్నారట. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలనుకునేలోపే ఈ ఫ్లెక్సీ వ్యవహారం బయట పడటం.. జరిగిన పరిస్థితిని చూసి అవాక్కయ్యారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: