ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యాచారం, హత్యలకు సంబంధించిన ఘటనలు పెరుగుతున్నాయి. ఏపీలో దిశ చట్టం అమలు చేస్తున్నా నేరాల సంఖ్య ఏ మాత్రం తగ్గటం లేదు. ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఒక ఉపాధ్యాయుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపటంతో బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఈ విషయం గురించి ఫిర్యాదు చేశారు. 
 
పూర్తి వివరాలలోకి వెళితే మదనపల్లె మండలం నీరుగట్టుపల్లెకు చెందిన ఒక విద్యార్థిని బి కొత్తకోట ఏపీ మోడల్ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతోంది. సంక్రాంతి పండుగ సెలవులకు బాలిక వారం రోజుల క్రితం ఇంటికి వచ్చింది. విద్యార్థినికి తెలుగు టీచర్ గా పని చేస్తున్న నవీన్ కుమార్ నిన్న ఉదయం టీచర్ గా పని చేసే తన అక్క క్వార్టర్స్ కు విద్యార్థినిని పిలిపించుకున్నాడు. 
 
ఇంటికి పిలిపించుకున్న తరువాత బాలికపై నవీన్ లైంగిక దాడికి పాల్పడ్డాదు. ఉదయం నుండి బాలిక ఇంట్లో కనపడకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు బాలిక ఇంటికి వచ్చిన వెంటనే గట్టిగా నిలదీయగా జరిగిన విషయం అంతా చెప్పింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు రెండో పట్టణ పోలీసులకు జరిగిన విషయాన్ని తెలిపి ఫిర్యాదు చేశారు. సీఐ రాజేంద్రకుమార్ నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. 
 
వైద్య పరీక్షల కొరకు బాధిత విద్యార్థినిని ఆస్పత్రికి తరలించారు. నవీన్ కుమార్ పై పోలీసులు ప్రాక్టో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే లైంగిక దాడికి పాల్పడటంతో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. బాలికకు నమ్మించి నవీన్ క్వార్టర్స్ కు పిలిపించుకున్నాడని సమాచారం. ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామని పోలీసులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: