ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత... పోలీసులు అందరూ అధికార పార్టీకి కొమ్ము కాస్తూ టిడిపి పార్టీ నేతలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు అంటూ ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టిడిపి నేతలు అందరూ ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పోలీసులు టిడిపి కార్యకర్తలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఎన్నో రోజులుగా ఆరోపణలు చేస్తునే ఉన్నారు. 

 

 

 అంతేకాకుండా గతంలో జెసి బ్రదర్స్ లో ఒకరైన జెసి దివాకర్ రెడ్డి పోలీసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు వైసీపీ కార్యకర్తల ప్రవర్తిస్తున్నారని ... ఆ బాధ్యత మర్చిపోయి అనవసరంగా దాడులు చేస్తున్నారు అంటూ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే తమ బూటు  నాకే పోలీసులను తీసుకుంటాము అంటూ వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. అప్పట్లో పోలీసులు కూడా జెసి దివాకర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

 

 

 

 ఇక తాజాగా జెసి బ్రదర్స్ లో ఒకరైన జెసి ప్రభాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పోలీస్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము  అధికారంలోకి రాకూడదని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు దేవున్ని  మొక్కు కోవాలి అంటూ మాజీ ఎమ్మెల్యే జే.సి ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒకవేళ తాము అధికారంలోకి వస్తే తమ పై అక్రమ కేసులు పెట్టిన పోలీసులు జైలుకు వెళ్తారు అంటూ వ్యాఖ్యానించారు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. తమపై అక్రమ కేసులు పెట్టిన ఎస్పి,  డిఎస్పి, ఎస్ఐ లకు నోటీసులు ఇచ్చామని ఆయన తెలిపారు. తాడిపత్రి నియోజకవర్గంలోని ప్రతి టిడిపి కార్యకర్తలకు అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. పోలీసుల అక్రమ కేసులు బనాయించి ఏమీ చేయలేరని కేవలం కేసు పెట్టి లోపల మాత్రమే వేయగలరు అంటూ వ్యాఖ్యానించారు జెసి ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం జెసి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: