అబ్బబ్బా.. ఈ ట్విట్టర్ గొడవలు ఏంది సామీ.. ఇలా జరుగుతున్నాయి అని అంటున్నారు నెటిజన్లు. అప్పట్లో ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిపై ఒకరు మట్టి ఎత్తి పోసుకునే వారు. ఇప్పుడు అవి ఏమి లేవు.. ఏదో ఘోరం జరిగితే తప్ప ప్రజల మధ్యలోకి రావడం లేదు రాజకీయ నాయకులూ.. ప్రజలు కూడా అలాగే రియాక్ట్ అవుతున్నారు లెండి..  

 

పక్కన మనిషి చేస్తున్నాడు అన్న పట్టించుకోరు.. అదే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అంటే చాలు చూసేస్తారు ఈ మనుషులు. అయితే ఇంకా అసలు విషయానికి వస్తే.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేధికగా చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.. చంద్రబాబు బండారం అంత బయటపెట్టారు. 

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. ''2014-19 మధ్య 20 సార్లు తాము పొడిగించిన పీడీ యాక్ట్ ను, ఇప్పుడు రొటీన్ గా మా ప్రభుత్వం పొడిగిస్తే.. బాబు, ఆయన బ్యాచ్ ఎలా గుడ్డలు చించుకుంటున్నారో చెప్పేందుకు ఈ 20 జీవోలే సాక్ష్యం!'' అంటూ ట్విట్ చేసి విమర్శలు చేశారు విజయసాయి రెడ్డి.

 

దీంతో ఈ ట్విట్లు ఉదయం నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు.. నారా లోకేష్ పై.. పవన్ కళ్యాణ్ పై, నాగ బాబుపై కూడా పంచులు పేలాయి. ఈ ట్విట్ల కారణంగా ఆంధ్ర రాజకీయ నాయకుల మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే నడిచింది. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: