విజయసాయి రెడ్డి... ఎప్పుడు ఏదో ఒక విషయంపై సోషల్ మీడియాలో ఫైర్ అవుతుంటారు.. వైసీపీ ప్రధాన కార్యదర్శి అయినా విజయసాయి రెడ్డి.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ప్రతిపక్షాలు చేసే చిల్లర ఆరోపణలపై ఘాటుగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై మండిపడ్డారు విజయసాయి రెడ్డి. ఈ మేరకు ట్విట్టేర్ వేధికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.          

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. ''10 లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ సంపద హుష్ కాకి అవుతుందనే టెన్షన్ ముందు సంక్రాంతి పండుగ ఎంత. డబ్బుంటే ప్రతి క్షణం ఉత్సవమే అనేది చంద్రబాబు, ఆయన వర్గీయుల ప్రగాఢ విశ్వాసం. ఈ లోగా ఇటు వాళ్లను అటు పంపిస్తాడు. తటస్థులను తెరపైకి తెస్తాడు. దేనికైనా సిద్ధమే విజనరీ!'' అంటూ ట్విట్ చేసి విమర్శలు చేశారు విజయసాయి రెడ్డి. 

 

దీంతో ఈ ట్విట్లు ఉదయం నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు.. నారా లోకేష్ పై.. పవన్ కళ్యాణ్ పై, నాగ బాబుపై కూడా పంచులు పేలాయి. ఈ ట్విట్ల కారణంగా ఆంధ్ర రాజకీయ నాయకుల మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే నడిచింది. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ఆంధ్ర రాజకీయాలు చాలా వేడి వేడిగా ఉన్నాయి.. ఎప్పుడు ఏలాంటి మలుపు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: