విజయసాయి రెడ్డి ఎప్పుడు మాట్లాడిన అది ఖచ్చితంగా ప్రతిపక్ష నేతల గుండెల్లో గుచ్చుకుంటుంది. ప్రతిపక్షాలు వణికిపోయేలా విజయసాయి రెడ్డి మాట్లాడుతారు. విజయసాయి రెడ్డి మాటలు చూస్తే ఆశ్చర్యం కూడా వేస్తుంది. వైసీపీ ప్రధాన కార్యదర్శి అయినా విజయసాయి రెడ్డి.. వైసీపీ పార్టీని ఏ ఒక్కరు ఒక్క మాట అన్న కూడా ప్రతిపక్షాలకు ట్విట్టర్ వేధికగా బుద్ది చెప్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు.   

 

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఉహల గురించి విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. ''మనమంతా జాతీయ నాయకులను, సమున్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులను గౌరవిస్తాం. స్మరించుకుంటాం. చంద్రబాబుకు  ఆ అలవాటే లేదు. ఆయన ఆరాధించేది ప్రపంచ కుబేరులైన బిల్ గేట్స్, వారెన్ బఫెట్, జెఫ్ బెజోస్ లాంటి వారినే. తనూ ఆ స్థాయికి ఎదగాలని అవినీతి మార్గాన్ని ఎంచుకున్నాడు.'' అంటూ ట్విట్ చేసి చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు విజయసాయి రెడ్డి. 

 

ఈ ట్విట్ చుసిన నెటిజన్లు.. సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఆ ఊహల గురించి ఎందుకు లెండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఈ ట్విట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ ట్విట్ కారణంగా అటు వైసీపీ అభిమానులను.. ఇటు టీడీపీ అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధమే నడిపించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా.. ఈ మధ్య విజయసాయి రెడ్డి ఏ ట్విట్ పెట్టిన సరే సోషల్ మీడియాలో సంచలనమే అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: