ఈమధ్యకాలంలో ఎక్కువ మంది భార్యలు భర్తలను చంపేస్తున్నారు. భర్తను చంపి ఆ స్థానంలోకి మరొకరిని తీసుకురావటం.. వారి ముఖంపై యాసిడ్ పోసి కాలింది అని చెప్పి నమ్మించడం.. మరికొందరు భర్తను చంపి ఏకంగా శవాన్ని మాయం చెయ్యడం.. ఇలా భర్తలను చంపే భార్యలు ఎక్కువ అయిపోయారు.
అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా.. ఆలస్యంగా వచ్చిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఘటన ఏంటి అంటే.. ఓ భార్య కంటిలోకి వేసుకునే చుక్కల మందుతో భర్త ప్రాణం తీసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సౌత్ కరోలినాలో 2018లో స్టీవెన్ క్లేటన్ , లానా స్యూ క్లేటన్ అనే వృద్ధ భార్యభర్తలు ఉండేవారు.
అయితే ఈ దంపతులు షార్లెట్ సమీపంలోని క్లోవర్లో నివసిస్తున్నారు. ఏమైందో తెలీదు.. 2018 జూలైలో స్టీవెన్ తల తిరిగి ఇంటి మెట్లపై పడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అందరూ కూడా అది సాధారణ మరణం అనే అనుకున్నారు. కానీ పోస్టుమార్టం నివేదికలో మాత్రం తాగే నీటిలో విషపదార్థం కలవడంతోనే స్టీవెన్ మృతిచెందాడని తేలింది.
స్టీవెన్ తాగిన నీటిలో టెట్రాహైడ్రోజోలిన్ ఎక్కువ మోతాదులో ఉండడంతోనే అతను మరణించాడని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారు. దీంతో ఇంట్లో ఉండేది వాళ్ళు ఇద్దరే కాబట్టి భార్యే ఆ పని చేసింది అని 2018 ఆగస్టులో పోలీసులు లానాపై కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో లానా... 2018 జూలై 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు అతను తాగే నీటిలో కంట్లో వేసే చుక్కల మందు కలిపి ఇచ్చినట్లు తెలిపింది.
అయితే అది కూడా స్టీవెన్ను మత్తులోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే నీటిలో చుక్కల మందు కలిపి ఇచ్చానని.. కానీ అదే అతని ప్రాణాలు తీస్తుందని ఊహించలేదని ఆమె చెప్పింది. అయితే తాజాగా ఈ కేసు కరోలినా న్యాయస్థానంలో విచారణకు రాగా విచారణలో తన నేరాన్ని అంగీకరించిన లానాకు కోర్టు 25 ఏళ్ళు జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ ఘటనను తెలుసుకున్న యువకులు అందరూ కూడా.. భర్తలపై ఎందుకు ఇంత కక్షకట్టారు ఈ భార్యలు.. ఎక్కడ చుసిన భర్తలను చంపేస్తున్నారు.. బాబోయ్ పెళ్లే చేసుకోకూడదురా నాయన అని తలలు పట్టుకుంటున్నారు.. మరి మీరు ఏం అంటారు ?