దేశంలో ప్రతిరోజు మహిళలపై అభం శుభం తెలియని చిన్నారులపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. కొంత మంది దుర్మార్గులు అత్యాచారం తర్వాత దారుంగా హత్యలకు కూాడా పాల్పపడుతున్నారు. ఇటీవల తెలంగాణలో వెటర్నరీ డాక్టర్ దిశ ను నలుగురు కామాంధులు అత్యాచారం చేసి దహనం చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఆ నలుగురు దుర్మార్గులను పోలీసులు సీన్ ఆఫ్ యాక్షన్ సందర్భంగా విచారిస్తున్న సమయంలో పోలీసుల వద్ద ఆయుధాలు లాక్కొని దాడి చేస్తున్న క్రమంలో తమను రక్షించుకునే నేపథ్యంలో ఎన్ కౌంటర్ చేసినట్లు తెలిపారు. 

 

హనుమకొండలో తొమ్మిదినెలల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడు ఓ కామాంధుడు...హజీపూర్ లో ముగ్గురు అమ్మాయిలను దారుణంగా అనుభవించి బతికి ఉండగానే బావిలో పూడ్చివేశాడు...మరోకామాంధుడు ఇలా చిన్నా పెద్దా తేడా లేకుండా ఆడవారిపై దారుణ అకృత్యాలకు పాల్పతున్నారు. తాజాగా బెంగళూరులోని కోలారు జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ వృద్దుడికి న్యాయస్థానం మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. వెంకటేశప్ప(65) అనే వృద్ధుడు 2018 మే 1న మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

 

తన మనవరాలి వయసు ఉన్న ఆ బాలికపై కొంత కాలంగా కన్ను వేసిన ఆ వృద్దుడు సమయం కోసం వేయిట్ చేస్తూ ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేరని చూశాడు. మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై వేమగళ్ పోలీసులు వెంకటేశప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.   కాగా, ఈ కేసు దాదాపు ఒకటిన్నర సంవత్సరం వాదోపవాదాలు జరిగాయి. అయితే బాలికకు అన్యాయం జరగడంపై గ్రామా స్థాయిలోనే కాదు పట్టణ స్థాయిలో కూడా నిరసనలు వెల్లువెత్తాయి.  ఈ విచారణలో నేరం రుజువు కావడంతో కోలారు రెండవ సెషన్స్ కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: