విజయసాయి రెడ్డి... ఎప్పుడు ఏదో ఒక విషయంపై సోషల్ మీడియాలో ఫైర్ అవుతుంటారు.. వైసీపీ ప్రధాన కార్యదర్శి అయినా విజయసాయి రెడ్డి.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ప్రతిపక్షాలు చేసే చిల్లర ఆరోపణలపై ఘాటుగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై మండిపడ్డారు విజయసాయి రెడ్డి. ఈ మేరకు ట్విట్టేర్ వేధికగా సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి.                 

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. ప్రధానులను డిసైడ్ చేశాను. రాష్ట్రపతులను సెలెక్ట్ చేశానని డప్పుకొట్టుకునే వ్యక్తి ఇన్ సైడర్ భూములు కాపాడుకునేందుకు దిగజారి మాట్లాడుతున్నాడు. ఉత్తరాంధ్ర ప్రజలు వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ రాజధాని కోరుకోవడం లేదట. కర్నూలు వాళ్లు జ్యుడీషియల్ క్యాపిటల్ వద్దేవద్దని ఈయన చెవిలో చెప్పారట'' అంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశాడు విజయసాయి రెడ్డి. 

 

దీంతో ఈ ట్విట్లు ఉదయం నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు.. నారా లోకేష్ పై.. పవన్ కళ్యాణ్ పై ట్విట్టర్ వేదికగా కూడా పంచులు పేలాయి. ఈ ట్విట్ల కారణంగా ఆంధ్ర రాజకీయ నాయకుల మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే నడుస్తుంది. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ఆంధ్ర రాజకీయాలు చాలా వేడి వేడిగా ఉన్నాయి.. ఎప్పుడు ఏలాంటి మలుపు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: