ఇండియాలో క్రికెట్ కి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇండియా జట్టులో స్థానం సంపాదించడానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కింది స్థాయి క్రికెట్ లో మంచి ప్రదర్శన చేస్తే టీమిండియాలో చోటు సంపాదించేందుకు ఎంతో అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు కింది స్థాయి క్రికెట్ లో అద్భుత ప్రదర్శన చేసి టీమిండియాలో చోటు సంపాదించుకున్న యువ ఆటగాళ్లు ఎంతోమంది. ఎంతో మంది  టీమ్ ఇండియా జట్టులోకి కొత్త   ఆటగాళ్ళు వస్తూనే ఉంటారు పోతూనే  ఉంటారు. కానీ కొంతమంది యువ ఆటగాళ్లు టీమిండియా జట్టులో స్థానం సంపాదించిన తర్వాత జట్టులో ఎక్కువ కాలం మనుగడ సాధించలేరు. 

 

 

 టీమ్ ఇండియాలో ఉండే ఒత్తిడిని  తట్టుకోలేక పేలవ ప్రదర్శన చేస్తూ... జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవటానికి చాలా కష్ట  పడుతూ ఉంటారు . ఇలా పేలవ  ప్రదర్శన చేసి జట్టులో స్థానం సంపాదించుకున్న కొన్ని రోజుల్లోనే జట్టు  నుంచి వైదొలగిన ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. అయితే ఆ తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎంతో కసరత్తు చేస్తుంటారు. కొంత మంది ఆటగాళ్ల జట్టులో స్థానం సంపాదిస్తే  కొంతమంది మాత్రం జట్టులో స్థానం కోసం ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే నిరాశ చెందుతుంటారు. ఇక్కడ ఓ భారత బౌలర్ కు అలాంటి సంఘటన ఎదురైంది. 

 

 

 టీం ఇండియా మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్ కొన్ని రోజులపాటు టీమిండియా జట్టులో  కొనసాగి ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీం ఇండియా మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్ సంచలన ఈ విషయాన్ని బయటపెట్టారు. గతంలో టీమ్ ఇండియా లో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవకాశాలు రాకపోవడంతో ఎంతో డిప్రెషన్ కు  లోనయ్యానని ... అదేసమయంలో ఐపీఎల్ కాంట్రాక్ట్ కూడా ముగియడంతో.. మరింత మనస్తాపం చెందాను  అంటూ మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇక ఆ సమయంలో తీవ్ర డిప్రెషన్  లోనైన తాను... తన దగ్గర ఉన్న లైసెన్స్డ్  గన్ తో  షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాను అంటూ  షాకింగ్ నిజాలు బయటపెట్టారు ప్రవీణ్ కుమార్. అయితే కార్ లో  నవ్వుతూ ఉన్న తన పిల్లల ఫోటో చూసిన తర్వాత నిర్ణయం మార్చుకునానని  తెలిపారు. ప్రస్తుతం బాగానే ఉన్నా అని చెప్పుకొచ్చాడు ప్రవీణ్ కుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: