ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సుపుత్రుడు, మాజీ మంత్రి, సుపుత్రుడు, పప్పు.. ముద్దా పప్పు.. ఇలా ఒకటి కాదు చాల పేర్లే ఉన్నాయి. అతను ఎవరో కాదు నారా లోకేష్.. ఎప్పుడు ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేసి నవ్వుల పాలవుతూ ఉంటాడు ఈ లోకేష్ బాబు. 

 

అలాంటి ఈ లోకేష్ ఈరోజు ట్విట్టర్ వేదికగా రాజధాని విభజనపై సంచలన ట్విట్లు చేశాడు.. నారా లోకేష్ ట్విట్ చేస్తూ.. రాజధాని విభజన నిర్ణయం అద్భుతం అని వైకాపా నాయకులు డప్పు కొడుతున్నారు. నిర్ణయం అంత గొప్పదయితే వైఎస్ జగన్ గారు ఎందుకు భయపడుతున్నారు? 13 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులని ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు? మా నాయకులు చేసిన తప్పేంటి?.. 

 

శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుని కాలరాసే అధికారం ఈ జగన్ గారి ప్రభుత్వానికి ఎవరిచ్చారు? గ్రామాల్లో పోలీసు లాఠీలు, ముళ్ల కంచెలతో ఉద్యమాన్ని అణిచివేయడం సాధ్యం కాదు. వైకాపా ప్రభుత్వం ఎంత తొక్కాలి అనుకుంటే అంతకి పదింతలు ఉద్యమం ఉధృతం అవుతుంది.'' అంటూ ట్విట్ చేశాడు.. నారా లోకేష్. 

 

అయితే ఈ ట్విట్ చుసిన నెటిజన్లు.. 2014 నుంచి 2019 వరకు మనం చేసింది ఇంత కంటే దారుణం.  ఇది చాలా తక్కువ కాబట్టి....పెద్ద గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు లోకేష్ గారు అంటూ కౌంటర్ ట్విట్లు చేసారు నెటిజన్లు..  

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: