వామ్మో.. వామ్మో.. మన కేంద్ర బడ్జెట్ కంటే వారి సంపదే ఎక్కువట.. మన భారత్ లో 63 బిలినియర్లు 2018-19 కేంద్ర బడ్జెట్‌ అంటే రూ 24.42 లక్షల కోట్ల కంటే ఎక్కువగా వాళ్ళు సంపాదిస్తున్నారని ఓ తాజా సర్వే వెల్లడించింది. దేశంలో కేవలం ఒక్క శాతంగా ఉన్న సంపన్నుల సంపద 70 శాతం జనాభా అంటే 95.3 కోట్ల మంది వద్ద ఉన్న సంపద కంటే నాలుగు రెట్లు అధికంగా ఉందని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంకు చెందిన హక్కుల సంస్థ ఆక్స్‌ఫాం నివేదిక వెల్లడించింది. 

 

అంతేకాదు.. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇదే రీతిలో కొనసాగుతోందని ఆర్థిక అసమానతలు ఎంతలా విస్తరించాయో ఆక్స్‌ఫాం సర్వే కళ్లకు కట్టినట్టు చూపింది. డబ్ల్యూఈఎఫ్‌ 50వ వార్షిక సమావేశానికి ముందు టైమ్‌ టూ కేర్‌ పేరుతో ఆక్స్‌ఫాం​ ఈ నివేదికను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2,153 మంది బిలియనీర్ల సంపద ప్రపంచవ్యాప్తంగా 60 శాతంగా ఉన్న 460 కోట్ల మంది వద్ద ఉన్న సంపద కంటే అధికంగా ఉందని తెలిపింది. 

 

దశాబ్ధంలో బిలియనీర్ల సంఖ్య రెట్టింపు అయ్యింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు మరింత పెరిగాయని.. ఇవి ఆందోళనకు గురిచేస్తున్నాయి అని నివేదిక పేర్కొంది. ధనిక, పేదల మధ్య వ్యత్యాసం తగ్గించేందుకు సరైన విధానపరమైన చర్యలు అవసరమని, కేవలం కొన్ని ప్రభుత్వాలే వీటికి కట్టుబడి ఉన్నాయని ఆక్స్‌ఫాం ఇండియా సీఈవో అమితాబ్‌ బెహర్‌ పేర్కొన్నారు.

 

అయితే సాధారణ ప్రజలు ముఖ్యంగా పేద మహిళలు, చిన్నారుల శ్రమకు సరైన ప్రతిఫలం దక్కడం లేదని, వారి ప్రయోజనాలను పణంగా పెట్టి సంపన్నులు ఎదుగుతున్నారని నివేదిక ఆవేదన వ్యక్తం చేసింది. టెక్నాలజీ కంపెనీ సీఈవో తీసుకునే వార్షిక వేతనాన్ని ఇంటి పనులు చేసే మహిళా కార్మికురాలు అందుకోవాలంటే ఏకంగా 22,227 సంవత్సరాలు పడుతుందని నివేదిక అంచనా వేసింది. 

 

మహిళలు, చిన్నారులు చేస్తున్న పనులకు సరైన వేతనం దక్కడం లేదని, పేదరికం, అసమానతలను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన నిధులను సమీకరించడంలో ప్రభుత్వాలు సంపన్న వ్యక్తులపై భారీగా పన్నులను వడ్డించడంలో విఫలమవుతున్నాయని తెలిపింది. అంటే.. దీన్ని బట్టి చూస్తే.. ఇంకా ఎప్పటికి పేదవాడు పేదవాడిలానే ఉంటాడు.. ధనవంతుడు ఇంకాస్త ధనవంతుడు అవుతాడు. ఇదే చెప్తుంది ఈ నివేదక. ఈ నివేదిక చదివిన ప్రతిఒక్కరికి అర్థమై ఉంటుంది.. పేదవాడు ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నాడు అనేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: