మూడు రాజధానుల అంశం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. మూడు రాజధానుల్లో ఏది ఎక్కడ ఉంటుంది అనే విషయం తేలిపోయింది. కేబినెట్ మూడు రాజధానులు ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం దీని గురించి స్పెషల్ అసెంబ్లీ సమావేశాల్లో చర్చలు జరుపుతున్నారు. ఈ బిల్లుపై ఈరోజు సాయంత్రంగాని, రేపుగాని ఓటింగ్ జరిగే అవకాశం ఉన్నది. ఓటింగ్ ద్వారా బిల్లును అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, మూడు రాజధానులు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైతే దాని ద్వారా ఆదాయం పెరుగుతుంది. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపాధి లభిస్తుంది. ఉపాధితో పాటుగా అంరికి ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. దాని వలన కూడా ఆదాయం లభిస్తుంది. అభివృద్ధి చెందితే పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమల వలన మరికొంతమంది ఉపాధి లభిస్తుంది.
ఈ ఉపాధితో పాటుగా అన్ని అన్ని రకాలుగా కూడా రాష్ట్రం అభివృద్ధి పాదంలో పరుగులు తీస్తుంది. అంతేకంటే కావాల్సింది ఏముంటుంది. అభివృద్ధి జరిగితే మనిషి తలసరి ఆదాయం పెరుతుంది. తలసరి ఆదాయం పెరిగితే, సంపద పెరుగుతుంది. మనిషి తలసరి ఆదాయం పెరగడం వలన అది రాష్ట్రానికి, దేశానికీ మేలు చేసినట్టు అవుతుంది. ప్రపంచంలో తలసరి ఆదాయంలో ఇండియా వెనకబడి ఉన్నది.
ఇప్పుడు ఆదాయం పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదాయం పెరిగితేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఆదాయం పెరగాలి అంటే స్థానికంగా ఉద్యోగాలు సృష్టించాలి. ఉద్యోగాలు సృష్టించాలి అంటే, ఎక్కడికక్కడ అభివృద్ధి సాధ్యం కావాలి. ఇవన్నీ సాధ్యం కావాలి అంటే అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి. ఆంధ్రప్రదేశ్ లో దీనినే అమలు చేస్తున్నారు. అధికారంలో వైకాపా ప్రజల శ్రేయస్సును కోరి ఈ విధమైన నిర్ణయం తీసుకున్నది.