సందు దొరికితే చాలు ఇంటర్నెట్ ఉందంటే చాలు బ్లూ ఫిలిమ్స్ అని ఇంకోవని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు నాయకులైతే ఇంక అసలు ఏముంటుంది.. ప్రజలు మంచి మార్గంలో నడవాల్సింది పోయి అందరు అదే మార్గంలో నడుస్తున్నారు. సినిమాలు కూడా వీరిని చూసే కొత్త ఆలోచనలు నేర్చుకోవాలంటూ ఓ మంత్రి సంబోదించాడు. 

 

విషయానికొస్తే..  దేశంలో ద‌శాబ్దాలుగా ఉండిన ప్లానింగ్ క‌మిష‌న్ ను ర‌ద్దు చేసి న‌రేంద్ర‌మోడీ నీతీఆయోగ్ ను ఏర్ప‌రిచారు. అందులోని స‌భ్యులు.. దేశానికి ఏం కావాలో, ఏం వ‌ద్దో డిసైడ్ చేస్తూ ఉంటారు. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో కూడా నీతీఆయోగ్ చాలా రాజ‌కీయ‌మే చేసింది. ప‌లు సార్లు నీతి ఆయోగ్ అంటూ మెరుపు తీగలా చూపించి. మొహం చాటేసింది. అంటూ వ్యాఖ్యానించారు. 

 


ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ క‌శ్మీర్ లో ఇంట‌ర్నెట్ సేవ‌లు బంద్ అయ్యాయి. వాటిని పున‌రుద్ధ‌రించే ధైర్యం చేయ‌డం లేదు మోడీ స‌ర్కారు. ఎక్క‌డైతేనేం.. ఇలా నిర్బంధంతో ఎన్నాళ్లు క‌ప్పి పుచ్చుతారు? అనేది కేంద్రం స‌మాధానం ఇవ్వాల్సిన ప్ర‌శ్న‌. ఆ ప్ర‌శ్న‌నే నీతీఆయోగ్ స‌భ్యుడు అయిన ఈ సారస్వ‌త్ ద‌గ్గ‌ర అడిగితే.. ఆయ‌న త‌న‌దైన రీతిలో స్పందించారు.

 

'ఇంట‌ర్నెట్ ఉంటే ఏం చేస్తారు.. బ్లూ ఫిల్మ్ లు చూడ‌టం త‌ప్ప‌..' అంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు.  ఇంట‌ర్నెట్ అంటే .. బ్లూ ఫిల్మ్ లే అనే స్థాయిలో ఉంది వీరి మేధోత‌నం. ఇంట‌ర్నెట్ తో అది త‌ప్ప మ‌రో సౌల‌భ్యం ఉండ‌ద‌ని ఈ మేధావి భావించారు. త‌న అభిప్రాయాన్ని చెప్పారు. అందులో త‌ప్పు లేదు. అయితే ఇలాంటి వారు దేశ ప్రణాళిక సంఘంలో ఉండ‌ట ఉంది చూశారూ.. అదీ ఈ దేశ ప్ర‌జ‌ల దౌర్భాగ్యం. అలా బ్లూ ఫిలిమ్స్ చూడొచ్చు అంటూ ఓ సారి ఒక రాష్ట్ర అసెంబ్లీలోనే నిరూపించారులే. అప్ప‌ట్లో క‌ర్ణాట‌క అసెంబ్లీలో బీజేపీ స‌భ్యులు ఒకే బెంచ్ లో కూర్చుని నీలి చిత్రాలు చూస్తూ వీడియోల‌కు ఎక్కారు. వారిని బీజేపీ క్ష‌మించింది. ఇటీవ‌లే ఒక‌రిని మంత్రిగా కూడా చేసిన‌ట్టుగా ఉన్నారు అంటూ అయన ఏకీపడేసారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: