వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా తరచూ ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. జగన్ మోహన్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత ఈమె మంత్రివర్గంలో స్థానం ఆశించగా అవి కాస్త అడియాశలు అయ్యాయి. కానీ పార్టీకి తాను ఎప్పుడూ నమ్మకస్థురాలిని అని ఎప్పటికప్పుడు రోజా నిరూపించుకుంటూ వస్తుంది. సమయం వచ్చినప్పుడల్లా ప్రతిపక్షం మీద పడిపోతూ అధికారపక్షం తీసుకున్న నిర్ణయాలను వెనకేసుకొని వస్తూ ఉండే రోజా తాజాగా రాష్ట్రంలో హాట్ టాపిక్ అయినా మూడు రాజధాని విషయంపై కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

క్రితం చంద్రబాబు చెప్పిన రెండు కళ్ళ సిద్దాంతం లాగే రోజా ముగ్గురు పిల్లల సిద్ధాంతాన్ని కూడా నేడు మీదకు తెచ్చింది. ఆమె చెప్పిన దాని ప్రకారం తమ ప్రభుత్వం ప్రపోజ్ చేసిన మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఒకటి అని.. దానికి తెలుగుదేశం పార్టీ వారు ఎందుకు బాధ పడుతున్నారో ఆమెకు అసలు అర్థం కావడం లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మూడు ఉంటే తప్పేంటి అని చంద్రబాబు ని ప్రశ్నించిన రోజా ఒక తల్లికి ముగ్గురు పిల్లలు ఉంటే అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత తల్లి ఉంటుంది కదా అని ఎదురు ప్రశ్న వేసింది.

 

ఒకరిని బాగా చూసే మరొకరి కడుపు మాడ్చదు కదా అని ప్రశ్నించిన రోజా చంద్రబాబు జోలిపట్టి అడుక్కుంటున్నాడు అంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడిన రోజాకూకట్ పల్లి నుండి రౌడీలను తీసుకొచ్చి ఉద్యమం పేరుతో రౌడీయిజం చేస్తున్నారని, చంద్రబాబు 29గ్రామాలకు ప్రతిపక్ష నేతా…? రాష్ట్రానికా అంటూ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: