ఈ మద్య ప్రేమలు హద్దులు దాటుతున్నాయి. ముఖ్యంగా డేటీంగ్ కల్చర్ వచ్చాక.. అది ప్రేమా, కామమా అని ఆలోచించకుండా చేస్తున్న పనుల వల్ల కొన్ని సార్లు సభ్యసమాజం తలదించుకునేలా ఉంటుంది.  మనం ముందుకు వేలుతున్నామా లేక నాగరికత పేరుతో అనాగరికత వైపుకు వేలుతున్నామా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి.  రువును అరాధించడంతోపాటు తల్లిదండ్రులు, దైవం తరవాత స్తానం గురువులకే కల్పిస్తుంది మన భారతీయ సంస్కృతి.  అందుకే గురు బ్రహ్మ...గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటూ త్రిమూర్తులతో పోల్చారు. పాశ్చాత్య సంస్కృతి రెక్కలు విప్పిన దేశాల్లో విద్యార్ధులకి విద్యా బుద్ధులు చెప్పాల్సిన టీచర్లు వారిని లైగికంగా వాడుకోవడం ప్రేమ పేరుతో చేడకోట్టడం లాంటి సంఘటనలు ఈ మద్య బాగానే జరుగుతున్నాయి.

 

విద్యార్థులుకు మాయ మాటలు చెప్పి లోబర్చుకోవడం.. పాస్ చేయని బెదిరించి వారిని శారీరకంగా వాడుకోవడం లాంటి సంఘటనలు ఎన్నో వెలుగు చూశాయి.  కొన్ని చోట్లు మైనర్ విద్యార్థినులపై లైంగిక దాడులకు దిగిన ఉపాధ్యాయుల పాపం బయట పడి దేహశుద్ది జరిగిన సంఘటనలు ఎన్నో జరిగాయ. అయితే ఆ మద్య తమిళనాడులో టీచమ్మ ఓ విద్యార్థికి మాయమాటలు చెప్పి అతనితో జంప్ అయిన విషయం పెద్ద కలకలం సృష్టించింది. తాజాగా  ఓ 26 సంవత్సరాల టీచరమ్మ 14 ఏళ్ల బాలుడితో జంప్ అయింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

 

తమ కొడుకును టీచర్ మాయమాటలు చెప్పి తీసుకెళ్లిందని ఆ విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకొని పారిపోయిన వారి కోసం గాలింపు చేపట్టారు.  8వ తరగతి చదవుతున్న ఆ బాలుడితో మహిళా టీచర్ ఏడాదిగా సన్నిహితంగా ఉంటుందని.. తన కుమారుడికి లేని పోని మాటలు చెప్పి అతన్ని శారీరకంగా లోబర్చుకుందని.. విద్యార్థి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ కొడుకును టీచర్ నుంచి తిరిగి ఇంటికి చేర్చాలని కోరారు.మైనర్ బాలుడిపై ప్రేమ వల విసిరిన టీచర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: