జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రైతులపై, మహిళలపై లాఠీ ఛార్జ్ జరుగుతోందని అది తనకు కంటతడి పెట్టిస్తోందని అన్నారు. పోలీసులు వైసీపీ పార్టీ అవలంబిస్తున్న విధానాన్నే అనుసరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీ నేతలు వాడుతున్న పదజాలం బాధాకరమని పవన్ అన్నారు. ఆడపచులపై పాశవికంగా దాడి చేశారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
జగన్ రెడ్డి గారు మీకు ఒక్కటే చెబుతున్నా... వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు జనసేన పార్టీ నిద్రపోదు అని పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులు ఆడపడచులపై చేసిన దాడిని తాను ఎప్పటికీ మరిచిపోనని పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో సమిష్టిగా రాజధాని గురించి నిర్ణయం తీసుకున్నారని ఆ తరువాత ప్రభుత్వం కూడా రాజధాని గురించి నిర్ణయాన్ని పాటించి తీరాలని అన్నారు. 
 
వైసీపీ వ్యక్తిత్వం ఫ్యాక్షనిష్టు సంస్కృతి, రౌడీ సంస్కృతి అని అన్నారు. ఆ సంస్కృతిని వైసీపీ పార్టీ ప్రజలపై చూపుతోందని ఈ విషయం తాను మొదటినుండి చెబుతున్నానని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇన్ని కులాలను, ఇంతమందిని ఒక సామాజికవర్గం ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసిందన్న నెపంతో క్షోభ పెడుతున్నారని అన్నారు. భవిష్యత్తులో వైసీపీ పార్టీ ఉండకూడదని వైసీపీ వినాశనం మొదలైందని చెప్పారు. 
 
రాజధాని కొరకు మూడు పంటలు పండే పొలాలను రైతులు త్యాగం చేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధాని అమరావతి నుండి కదలదని తాను రైతులకు హామీ ఇస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజలు అమరావతిలోనే శాశ్వత రాజధాని ఉండాలనే ఉద్దేశంతో ఓట్లు వేసి గెలిపించారని వైసీపీ పార్టీ నమ్మి ఓట్లు వేస్తే వంచన చేస్తోందని విమర్శలు చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగి ఉందని భావిస్తే ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసిన వాళ్లపై కేసులు పెట్టాలని అంతే కానీ రాజధానిని తరలించటం ఏమిటని ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: