ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. మానవతా విలువలను మంటగలిపి  వావి వరసలు మరిచి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటుంటారు. దీంతో సమాజం తీరు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. చిన్న పెద్ద తేడాలేకుండా వావి వరసలు మరిచి పోయి అక్రమ సంబంధం పెట్టుకుంటూ... సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు చాలామంది.. ఇక్కడ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని గడపాలని ఎన్నో ఆశలతో ఉన్న జంటకు... వారి తల్లి తండ్రులు భారీ షాక్ ఇచ్చారు. పెళ్లి  డేట్ ఫిక్స్ అయిన తర్వాత వరుడు తండ్రి వధువు తల్లి పరారయ్యారు.

 

 

 ఈ ఘటనతో బంధు మిత్రులతో పాటు అందరూ అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే... ఈ సభ్య సమాజం తలదించుకునే ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. కట్టర్ గ్రాంకి  కు చెందిన 48 ఏళ్ల వ్యక్తి... నాప్సారి  కి చెందిన చెందిన 46 ఏళ్ల వివాహిత ఇరుగుపొరుగు ఇళ్లలో  ఉండేవారు. ఇక ఇరుగుపొరుగు వాళ్లు అన్నాక ఇరు కుటుంబాల మధ్య స్నేహబంధం ఏర్పడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల మధ్య కూడా అలాంటి బంధం ఏర్పడింది. ఇక్కడ సదరు  వివాహితకు పెళ్లీడుకొచ్చిన కూతురు ఉంది... దీంతో పొరుగింట్లో ఉండే వ్యక్తి కొడుకుతో తన కూతురు వివాహం నిశ్చయమైంది. ఈ పెళ్లి కోసం ఇరు కుటుంబాలు అన్నీ లాంఛనాలు పూర్తి చేసుకొని పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకున్నాయి. 

 

 

 పెళ్లి పనులు కూడా జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో ముహూర్తం  పెట్టుకోన్నారు. కానీ  జనవరి 10వ తేదీ నుంచి వరుడు తండ్రి... వధువు తల్లి కనిపించడం లేదు. దీంతో వరుడు తరపు కుటుంబ సభ్యులు...వధువు తరుపున కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా కనిపించకుండా పోయిన ఈ ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇకపోతే వరుడు తండ్రి వధువు తల్లి చిన్నప్పటి స్నేహితులని... వాళ్ల మధ్య సాన్నిహిత్యం ఉండేది అని అందుకే పారిపోయి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు బంధువులు. కాగా ఈ పెద్దలు ఇద్దరు  పారిపోవడంతో... ఈ కొత్త జంట పెళ్లి ఆగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: