మద్యం ఎంతోమంది కాపురాల్లో చిచ్చు పెట్టింది. మద్యానికి బానిసైన భర్తలు రోజూ తాగొచ్చి భార్యలను  చిత్రహింసలకు గురి చేయడం లాంటి ఘటనలు రోజుకోకటి  తెరమీదికి వస్తూనే ఉన్నాయి.ఓ వైపు మద్యం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ మద్యానికి బానిస అవుతున్న వారు కూడా రోజురోజుకూ పెరుగుతున్నారు. పచ్చటి కాపురాల్లో చిచ్చు పెట్టి ఎన్నో హత్యలకు ఆత్మహత్యలకు కూడా కారణమైంది మద్యం. ఆనందంగా గడిచిపోతున్న  జీవితాల్లో విషాదం నింపింది. ఇక తాజాగా మద్యం మరో ప్రాణాన్ని బలిగొంది. ఇంట్లో ఇద్దరు దంపతుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ..ఓ ప్రాణం తీసింది. 

 

 

 వివరాల్లోకి వెళితే... భార్య భర్తల మధ్య తలెత్తిన గొడవతో విసిగిపోయిన  భార్య భర్త  పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్థాపం చెంది  భర్త ఉరి వేసుకున్న  ఘటన... చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాలో విజయ్ భాస్కర్  అమృత ఇద్దరు దంపతులు. 18 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరిద్దరూ కొద్దికాలంపాటు పాకాల లో నివసించగా ఆ తర్వాత... తిరుపతి కి మకాం మార్చారు. ప్రస్తుతం వీరు  అమృత స్వగ్రామమైన జంగాలపల్లి లో నివాసం ఉంటున్నారు. అయితే విజయభాస్కర్ తిరుపతిలో టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తుండేవాడు. అయితే కొన్నేళ్ల వరకు ఈ దంపతులు కాపురం సజావుగానే సాగినప్పటికీ ఆ తర్వాత విజయభాస్కర్ మద్యానికి బానిసయ్యాడు. 

 

 

 రోజు మద్యం తాగి వచ్చి భార్య  అమృతను చిత్రహింసలకు గురిచేసేవారు. ఫుల్లుగా మందు తాగి వచ్చి భార్యతో గొడవకు దిగడం కొట్టడం లాంటి చేసి హింసించేవాడు. ఇలా ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇదే క్రమంలో భర్త విజయ భాస్కర్ భార్య అమృత మధ్య మరోసారి గొడవ జరిగింది... ఇక భర్త తీరుతో విసిగి పోయిన అమృత స్థానిక పోలీస్ స్టేషన్ కు  వెళ్లి ఫిర్యాదు చేసింది. ఇక అమృత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం ఇంటికి చేరుకున్నారు. ఇంతలో భార్య తో  పాటు పోలీసులు షాక్ కి గురయ్యారు. పోలీసులు వచ్చే సమయానికి ఇంట్లో  విజయభాస్కర్ ఇంట్లో చీరతో ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: