రాజధాని మారిపోతోంది అంటూ అమరావతిలో ఉన్న అమాయకపు రైతులని రెచ్చగొడుతూ, భయభ్రాంతులకి గురిచేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి టీడీపీ, జనసేన  పార్టీలు. చంద్రబాబు జోలె పట్టుకుని, బిక్షాటన చేస్తూ చేపట్టిన హై డ్రామా అట్టర్ ఫ్లాప్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు అడుగులో అడుగులు వేసే పవన్ కళ్యాణ్  తానేమి తక్కువ కాదన్నట్టుగా అమరావతి రైతుల వద్ద చేస్తున్న సెంటిమెంట్ సీన్స్ మాంచి రక్తి కట్టించకపోగా సోషల్ మీడియాలో ఆ ఘటన తాలూకు ఫోటోలు బయటకి రావడంతో నవ్వుల పాలవుతున్నాడు

 

రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు, మహిళలు పవన్ కళ్యాణ్ ని కలవడానికి మంగళ వారం పార్టీ కార్యాలయానికి వచ్చారు. దాంతో ఒక్క సారిగా పవన్ తనలో ఉన్న టాలెంట్ ని బయటపెట్టారు. ఈ సందర్భాన్ని  వదులుకుంటే ఇలాంటి ఫోటోలు మళ్ళీ రావనుకున్నారో ఏమో కానీ  దూకుడు సినిమాలో మహేష్ బ్రాహ్మీ ని వాడేసినట్టుగా రాజధాని రైతుల అమాయకత్వాన్ని పవన్  తమ రాజకీయ స్వార్ధానికి వాడేసుకున్నారు.

 

గోటితో పోయే దాన్ని  గొడ్డలి  వరకూ తీసుకెళ్లడంలో  సిద్దహస్తుడైన  పవన్ ఏక దాటిన  ప్రసంగం చేస్తూ సెంటిమెంట్ డైలాగులు మధ్య మధ్యలో వదులుతూ మహిళలపై జరిగిన లాటీ చార్జ్ ఘటన నా కళ్ళలో నీళ్ళు తిరిగేలా చేసింది అంటూ నమ్మశక్యంకాని మాటలతో ప్రజలు విస్తుపోయేలా చేశారు. పవన్ కి నిజంగానే తమ గోడు విని కన్నీళ్లు వచ్చేయేమోనని భావించిన మహిళలు వామ్మో వాయ్యో పవనూ అంటూ  అసలు విషయం తెలియక పవన్ వద్ద భోరున విలపించారు..(ఇక్కడ ఒక క్లిక్)..అలాగే

 

మరికొంత మంది మహిళలని పవన్ దగ్గరకి వెళ్లి పలకరిస్తూ కింద్ర కూర్చోవడంతో అంత పెద్ద నటుడు, వ్యక్తి తమ పక్కన కూర్చున్నాడనే భావనతో తమకి తగిలిన లాటీ దెబ్బలు ఇవిగో అంటూ చూపించి న్యాయం చేయమని అడిగారు( ఇక్కడ కూడా ఒక క్లిక్ ).దాంతో   వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలో రాకూడదు అందుకు మనం అందరం ఎకమవ్వాలంటూ అసలు తన టార్గెట్ ఏమిటో చెప్పకనే చెప్పేశారు. గతంలో కూడా జనసేనాని  ముంతలో పెరుగన్నం తినడం,  కదిలే రైలులో తనకి చోటు లేదన్నట్టుగా టాయిలెట్ దగ్గర కూర్చుని పుస్తకం చదువుతూ ప్రజలని పిచ్చోళ్లని చేయడంలాంటి ట్రిక్కులు ప్రదర్శించిన విషయం విధితమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: