'కిరసనాయిలు' అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణాన... ఈ మాటా అనింది ఎవరో కాదు.. వైసీపీ ప్రధాన కార్యదర్శి అయినా విజయసాయి రెడ్డి అన్నారు. డైరెక్టుగా చెప్పలేదు.. కానీ ఎప్పుడు కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబుని విమర్శించే సమయంలో ఆంధ్ర జ్యోతి పత్రికలో వచ్చే కథనాలపై విమర్శలు చేస్తుంటారు.. ఈ నేపథ్యంలోనే నిన్న ఓ ట్విట్ పెట్టారు..  

 

ఆ ట్విట్ ఏంటంటే... '''బాస్' పదవి పోయినప్పటి నుంచి కిరసనాయిలుకు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రంగా కనిపించడం లేదు. వందల కోట్లు దోచుకుతినే అవకాశం కోల్పోవడంతో 5 కోట్ల మంది ప్రజల పైన ద్వేషం పెంచుకున్నాడు. అక్కడ ప్రభుత్వం లేదు. పరిపాలన లేదన్నట్టు చెత్త పలుకులు పలుకుతున్నాడు.'' అని పెట్టారు. 

 

అయితే ఈ ట్విట్ చుసిన వారందరు కూడా.. కిరసనాయిలు అంటే ఎవరు? ఆంధ్రజ్యోతి రాధా కృష్ణ ఏ కదా అని కామెంట్లలో అడుగుతున్నారు.. అయితే మరో పత్రిక కూడా.. ఈ ట్విట్ పై.. అలాగే కిరసనాయిలు అంటే ఎవరు అనే ప్రశ్న వేసి అడుగుతున్నారు.. దీంతో మరికొందరు నెటిజన్లు కూడా.. కిరసనాయిలు అంటే ఆంధ్రజ్యోతి రాధా కృష్ణ అని చెప్పుకొస్తున్నారు. 

 

అయితే విజయసాయి ఒక్క ఈరోజు మాత్రమే కిరసనాయిలు అని అనలేదు.. ఎప్పటి నుండో ఇన్ డైరెక్టుగా ఒకసారి.. డైరెక్ట్ గా ఒకసారి అయన అంటూనే ఉన్నాడు.. ఎప్పిటికప్పుడు ఆంధ్రజ్యోతిలో ప్రభుత్వానికి వచ్చే వ్యతిరేక కథనాలపై విజయసాయి రెడ్డి తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ఉంటారు.. ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా కిరసనాయిలు అంటూ రాసుకొచ్చింది.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: