ఈ మద్య ప్రతిరోజూ వార్తల్లో ఎక్కడ చూసినా మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హత్యల కు సంబంధించినే వస్తున్నాయి. ఈ మద్య దేశ వ్యాప్తంగా సంచలనం సృస్టించిన దిశ హత్య కేసు.. ఆ తర్వాత ఎన్ కౌంటర్ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టించింది.  ఎప్పటి నుంచో సాగదీస్తూ వస్తున్న నిర్భయ నింధితులకు ఉరి శిక్ష ఖరారైన విషయం కూడా తెలిసిందే.  అయినా కూడా కామాంధులు ఎక్కడా ఆగడం లేదు.. ఆడది కనిపిస్తే చాలు మృగాళ్లలా రెచ్చిపోతున్నారు.  తాజాగా ఓ ఒంటరి మహిళలను రైళ్లో అత్యాచారం చేశారు.. అయితే హత్యాచారం చేసి ఆనందం పొందుతారు.. కానీ వారు మాత్రం అసలు విషయం తెలుసుకొని కుళ్లి కుళ్లి ఏడుస్తున్నారు.  

 

ఈ దిక్కుమాలిన పని ఎందుకు చేశాం రా నాయనా అని ఏడుస్తున్నారు. వివరాల్లోకి వెళితే..  బీహార్‌లోని కైమూర్ జిల్లాకు చెందిన ఓ మహిళ అనారోగ్యంతో ఉండటంతో సోమవారం గయాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంది. రాత్రివేళ ఇంటికి తిరిగెళ్లేందుకు పాట్నా-బభువా ఇంటర్ సిటీ రైలు ఎక్కింది. అయితే బోగీల్లో జనాలు తక్కువ గా ఉండటంతో ఓ మూలన బిక్క బిక్కుమంటూ కూర్చుంది. ఆమె ఒంటరిగా రైలెక్కడాన్ని గమనించిన నలుగురు యువకులు అదే బోగీలోకి ఎక్కారు. ఇంకేముంది ఆమె నోరు నొక్కి ఒకరితర్వాత ఒకరు తమ కామవాంఛ తీర్చుకున్నారు. బాధితురాలు కేకలు పెట్టుకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. ఆ కామాంధుల పశువాంఛ కారణంగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.

 

అదే సమయంలో బోగీలు చెక్ చేయడానికి వచ్చిన పోలీసులు గీ తలుపులు వేసి ఉండడంతో అనుమానం వచ్చింది. దీంతో వారు గట్టిగా తలుపులు బాదారు. ఆ సమయంలో అత్యాచారం చేసిన నిందితులు అక్కడి నుంచి పరుగులు తీశారు. వారిని వెంబడించి పట్టుకున్నారు పోలిసులు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకుంది. ఆ తర్వాత పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. తన భర్త ఎయిడ్స్ కారణంగా చనిపోయాడని, అతడి నుంచే ఆ వ్యాధి తనకు వ్యాపించిందని బాధితురాలు తెలిపింది. తాము అత్యాచారం చేసింది ఎయిడ్స్ రోగినని తెలియడంతో పోలీసులకు పట్టుబడిన నింధితులు లబోదిబో అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: