అయన పేరుకు మాజీ మంత్రి.. కానీ ఎప్పుడు పప్పులో కాలు వేస్తుంటారు.. అయన పేరుకు ఎమ్మెల్సీ కానీ రాష్ట్ర ప్రజలంతా అయనపై పొట్ట పగిలే జోకులు వేస్తారు... కారణం.. అతగాడి పప్పు లక్షణాలు. తండ్రి రాజకీయాలలో అపర చాణిక్యుడు.. ఆ చాణిక్యుడుకి పుట్టిన అపర మేధావి ఈ పప్పు బాబు..
తండ్రి ఒకరికి వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కుంటే.. కొడుకు తండ్రికే తన తెలివితో చుక్కలు చూపించాడు. అతను ఎవరో కాదు.. ఒకటికి నాలుగు పేర్లు ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముద్దుల కొడుకు లోకేష్ బాబు. ఎప్పుడు ఏదో ఒక విషయంలో పప్పులో కాలు వేస్తూ ఉంటాడు.. వర్ధంతిని జయంతి చేసే అంత తెలివి ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఆంధ్ర ప్రజలందరూ చూపుతారు ఇతనిని.
ఇప్పుడు మళ్లీ తాజాగా ఏ త (ప)ప్పులో కాలేశారు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న... వికేంద్రీకరణ బిల్లుపై శాసనమండలిలో వాడివేడిగా చర్చ జరుగుతున్న సందర్భంలో మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకుడు లోకేష్ జోక్యం చేసుకుంటూ నవరత్నాల అమలుకోసం ఆలయాలు, చర్చిలు, మసీదుల విలువైన భూములను విక్రయించాలని ప్రభుత్వం జీవో ఇచ్చిందని ప్రభుత్వాన్ని విమర్శించాడు.
దీనికి ప్రతిస్పందించిన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి శాసనమండలిలో కూడా లోకేష్ అబద్ధాలు చెబుతున్నాడని, ప్రభుత్వం అలాంటి జీవోని ఏదీ ఇవ్వలేదని…. లోకేష్ ఇలాంటి ఆరోపణలు చేసిన సందర్భంగా ఆ జీవో కాపీలు చూపాలని లేదా కనీసం ఆ జీవో నెంబర్ అయినా చెప్పాలనడంతో లోకేష్ బిత్తర చూపులు చూశాడు..
ఇలా ఎప్పటికప్పుడు ముద్దు ముద్దుగా బిత్తర చూపులతో.. తప్పుడు మాటలతో అవమానాలపాలవుతూ పప్పు అని రాజకీయ విశేషకులతో విమర్శలు చేయించుకుంటూ ఉంటారు ఈ నారా లోకేషం గారు. మరి అసలు సంగతి ఏంటో చూడాలి.