నేటి సమాజంలో మానవత్వం మంట కలిసి పోతుంది. కన్న పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను కన్నతల్లె  హతమార్చడానికి కూడా వెనకాడని రోజులు నేడు మనం చూస్తున్నాం . కన్నతల్లి అంటే తొమ్మిది నెలలు కంటికి రెప్పలా తన కడుపులో మోసి.. పుట్టిన తర్వాత అల్లారుముద్దుగా పెంచి గోరుముద్దలు తినిపిస్తూ పెద్ద చేయాల్సిన అమ్మ... కన్న పేగు తెంచుకుని పుట్టిన వారిని కూడ కడ తేర్చింది. కనీసం మానవత్వం మరిచి కసాయిగా మారిపోయింది. ఒక కొడుకు ఇద్దరు కూతుళ్లను ఇంట్లో అందరూ ఉండగానే అతి దారుణంగా చంపి ఏమి ఎరుగనట్టుగా అందరిలోకి వెళ్ళిపోయింది ఈ కర్కశ తల్లి. యుఎస్లో సభ్య సమాజం తలదించుకునే ఒళ్ళు గగుర్పొడిచే ఈ  దారుణ ఘటన చోటుచేసుకుంది. 

 

 

 వివరాల్లోకి వెళితే... అమెరికాకు చెందిన రేచల్ హేన్రి  తన ముగ్గురు పిల్లలను అతి దారుణంగా కడతెర్చింది . మూడు ఏళ్ల వయసున్న తన కొడుకు ఎదుటే... సంవత్సరం వయసున్న తన కూతురుని గొంతునులిమి చంపేసింది ఈ కసాయి తల్లి . ఇంకా లోకానికి కూడా చూడని ఆ చిన్నారిని అప్పుడే చిసిమేసింది . అనంతరం కూతురు మంచంపై నిద్ర పోయినట్లుగా పడుకోబెట్టింది. ఇక ఆ తర్వాత కొడుకుని చంపడానికి ప్రయత్నించింది. అయితే ఈ కర్కశ తల్లి నుండి  కొడుకు తన తండ్రి వచ్చేంతవరకు తల్లి నుంచి తప్పించుకున్నారు. కాలింగ్ బెల్ కొట్టగానే తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అవసరం లేకున్నా  డైపర్ మారుస్తానని అబద్దం చెప్పి  లివింగ్ రూం లోకి తీసుకెళ్లి... కాళ్ళు చేతులు బిగిసి పట్టి... జోలపాడుతూ గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. 

 

 

 కవద్దమ్మా   నన్ను చంపొద్దు అమ్మ అంటూ కొడుకు ఎంత వేడుకున్నా  ఆ కసాయి  తల్లి మనసు మాత్రం కరగలేదు. పేగు తెంచుకుని పుట్టిన కొడుకు గొంతు నులిమి... ఊపిరాడక విలవిలలాడుతున్న ఆ సైకో మదర్ మాత్రం ఆ బాలున్ని  చంపేస్తుంది. బాలుడి తప్పించుకోవడానికి ఎంత ప్రతిఘటించిన లాభం లేకుండా పోయింది. ఇక బాలున్ని  చంపిన సైకో ఏమీ జరగనట్టుగానే అందరిలో తిరిగింది. ఆ తర్వాత తన మూడో  కూతురును కూడా అతి దారుణంగా గొంతుకోసి అత్యాచారం చేసింది. ఇంట్లో అందరూ ఉండగానే తన కన్న బిడ్డలను  తల్లి కడతేర్చడం ఒళ్ళు గగుర్పొడిచేల ఉంది . పిల్లలు కనిపించకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: