ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఎలాగైనా సరే జగన్ సర్కారు తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్ని విధాలా పోరాడినా జగన్ సర్కారు ముందుకే వెళ్తున్న సమయంలో ఆయన తన అమ్ముల పొదిలోఅస్త్రాలు బయటకు తీస్తున్నారు. శాసన మండలిలో తమ పార్టీకి ఉన్న ఆధిక్యాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. బిల్లుల ఆమోదాన్ని అడ్డుకునేందుకు, జాప్యం చేసేందుకు ఆయన నిన్న రూల్ 71 ను బయటకు తెచ్చిన సంగతి తెలిసిందే.

 

తాజాగా ఆయన శాసన మండలిలో సభ కార్యకలాపాలను అడ్డుకునేందుకు కుట్ర పన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకు సాక్ష్యంగా వారు వీడియోను ప్రస్తావిస్తున్నారు. ఆ వీడియోలో.. శాసనమండలిలో టీడీపీ సభ్యులు రౌడీయిజం చూపించామని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వద్ద సంతోషపడుతున్నట్టుగా ఉంది. అంతే కాదు.. టీడీపీ ఎమ్మెల్సీలను చంద్రబాబు కూడా వారిని చాలా బాగా చేశారని అభినందిస్తున్నారు.

 

ఇప్పుడు ఈ వీడియో కలకలం రేపుతోంది. అందులో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీలను చాలా బాగా చేశారని మెచ్చుకున్నారు. మంత్రులను అడ్డుకున్న తీరుపై ఆయన టీడీపీ ఎమ్మెల్సీలను ఆయన ప్రశంసించారు. అంతే కాదు. తాను ఒకటి, రెండుసార్లు వచ్చి చూశానని, ఆ తర్వాత టివీలలో స్క్కోలింగ్ లు చూస్తున్నానని చెప్పుకొచ్చారు. మీరు బాగా చేశారని ఆయన అన్నట్లుగా ఆ వీడియోలో కనిపించింది.

 

ఆ వీడియోలో ఇంకా ఏమన్నారంటే.. ఎమ్మెల్సీ అశోక్ బాబు లో రౌడీని చూశామని, బెజవాడ రౌడీయిజం ఆయనలో చూశామని అనడం విచిత్రం. ఎప్పుడు వైసీపీ వాళ్లు వచ్చినా, మనవాళ్లు గొడవపడ్డారని చంద్రబాబు ఆ వీడియోలో అంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో ఆధారంగా వైసీపీ నేతలు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. దీని ఆధారంగా ఆయనపై చర్య తీసుకునే అవకాశం లేకపోయినా.. ఆయన నైజాన్ని ఎండగట్టొచ్చని భావిస్తున్నారట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: