ప్రస్తుతం సమాజంలో ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో అర్దం కావడంలో. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ అర్ధరాత్రి ఒంటరి ప్రయాణాలు అస్సలు మంచిది కాదు. తోడు ఎవ్వరు లేకుండా ఒంటరి ప్రయాణాలు అంత మంచిది కాదు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఒంటిరిగా ప్రయాణం చేయాల్సి వస్తే ఇంట్లో వారికి ఇటు పోలీసులకు సమాచారాన్ని అందించి అప్పుడు ప్రయాణం చేయడం చాలా మంచిది. అలాగే ఓలా, ఊబర్ లాంటి క్యాబ్లను ఒంటరిగా ప్రయాణించేటప్పుడు ముఖ్యంగా మహిళలు వాటిని ఆశ్రయించి వాటిలో ప్రయాణం చేయడం ఏమాత్రం మంచిది కాదు. దానివల్ల చాలా అనర్ధాలు చోటుచేసుకుంటాయి. ఇటీవలె ఇలాంటి ఘటన ఒకటి బెంగుళూరు కమ్మనహళ్ళిలోని సిటిలైన్ దగ్గర చోటుచేసుకుంది.
ఓ విదేశి యువతి క్యాన్సర్ చికిత్స కొరకు బెంగుళూరు కమ్మనహళ్ళిలోని సిటీలైన్ ఆసుప్రతికి వెళ్ళడం కొరకు ఓలా క్యాబ్ను బుక్ చేసింది. వెంటనే అక్కడకు వచ్చిన క్యాబ్లో ఎక్కి వెళ్ళగా.. అదే క్యాబ్లో మరో ఇద్దరు తోటి ప్రయాణికుల వలె ఆమెతో కాస్త దూరం ప్రయాణించారు. ఆతరువాత ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు. కత్తులతో బెదిరించి ఆమెను శారీరకంగా చిత్రహింసకు గరిచేశారు. ఏమీచేయలేని నిస్సహాయ స్థితిలో ఉండగా ఆమె ఒంటిమీద నూలు పోగు కూడా లేకుండా మొత్తం బట్టలు విప్పేసి ఆమె పై మృగాళ్ళు అరాచకానికి పాల్పడ్డారు. అర్దరాత్రి నుంచి తెల్లవారు జామున 4.15 వరకు ఆమెను శారీరక హింసకు గురి చేశారు. ఆ తరువాత ఓ నిర్మాన్యుష్య ప్రదేశంలో ఆమెను పడేశారు. దాంతో ఆమె గట్టి గట్టిగా అరచి ఏడుస్తుండగా అక్కడికి దగ్గరలో ఉన్న ఓ ఫామ్ హౌస్ వారు ఆమె ఏడ్పు విని ఆమెను చూసి షాకయ్యారు.
వెంటనే ఆమెకు ఆశ్రయమిచ్చి పోలీసులకు సమాచారమివ్వగా. ఆమె జరిగిందంతా పోలీసులకు వివరించింది. దాంతో దొడ్లపురం పోలీసులకు సమాచారమివ్వగా పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. ఇకపోతే ఇలాంటి ఘటనలు జరగడం ఇది మొదటిసారి కాదు గతంలో కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అశ్రద్ధ వహించినా కొన్ని కొన్నిసార్లు జీవితాల్ని కోల్పోవలసి వస్తుంది. ఓ విదేశీ మహిళ పై భారతదేశంలో ఇలాంటి ఘటన జరగడం చాలా నీచమైన బాధాకరమైన విషయమనే చెప్పాలి.