నేటితరం యువత మాటల్లో వర్ణించలేని నీచమైన పనులను చేస్తూ మనిషి అన్న పదానికే అపకీర్తిని తీసుకొస్తున్నారు. పరాయి స్త్రీని తల్లిగా భావించినటువంటి స్వామి వివేకానంద సంచరించిన ఈ పవిత్ర నేలపైన.. ఏకంగా ఒకే తల్లికి జన్మించిన వారి మధ్య లైంగిక సంబంధం కొనసాగుతుందంటే నేటి  యువత ఏ స్థాయికి దిగజారారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఘటనలు మానవ సంబంధాలకే మాయని మచ్చలా మిగిలిపోతాయనడంలో సందేహం లేదు. ఇలాంటి దారుణం ఒకటి జరిగిన తీరు చూస్తే, ఈ లోకం ఎంతలా వినాశనానికి కారణం అవుతుందో అర్ధం అవుతుంది.. ఆ వివరాలు చూస్తే..

 

 

గుజరాత్ రాష్ట్రం సూరత్ నగరంలోని పనాస్ గ్రామంలోని ఎస్‌ఎంసి క్వార్టర్స్‌లో నివసిస్తున్న రమేష్ గాడ్సే (15) రెండు రోజుల క్రితం టిఫిన్ చేయడం కోసమని హోటల్ కి బయలుదేరాడు. అయితే మార్గమధ్యలో అతనికి ఎవరో చిన్న పిల్ల ఏడుపు వినిపించింది. దీంతో అతడు ఏడుపు వినిపించిన వైపు చూడగా అక్కడ, చెత్త కుప్పలో పడేసిన ఓ పసి బిడ్డ కనిపించింది..  ఒక్కసారిగా నిర్ఘాంతపోయిన అతను ఆ బిడ్ద దీన స్దితిని చూసి చలించి, తన స్వెటర్ ని బిడ్డ చుట్టూ చుట్టి తనతో పాటు ఇంటికి తీసుకు వెళ్ళాడు. అక్కడ అతని తల్లికి రమేష్ మొత్తం పరిస్థితిని వివరించి చెప్పాడు.

 

 

దీంతో ఆ తల్లి తక్షణమే స్పందించి 108కి డయల్ చేసి సమాచారం అందించింది. దీంతో 108 సిబ్బంది ఆ బిడ్డను శిశు వైద్య ఆసుపత్రికి తరలించి, తర్వాత పోలీసులకు సమాచారం అందించగా.. వారు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఇలా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పనాస్ గ్రామంలో గర్భవతులు ఎవరెవరు ఉన్నారో విచారించగా... ఒక అమ్మాయి గర్భంతో ఉందని తెలిసింది. దీంతో పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి ఆమెను విచారించగా.. తానే ఆ బిడ్డను చెత్త కుప్పలో పడేసానని అంగీకరించింది. ఎందుకని ప్రశ్నించిన పోలీసులకి ఆమె దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.

 

 

ఆమె మాట్లాడుతూ.. తనని తన సొంత అన్నయ్య బలవంతం చేయడంతో అతడితో గత రెండేళ్లగా శృంగారం చేస్తున్నానని.. దానికి ఫలితంగా గర్భం వచ్చిందని చెప్పింది. కానీ పుట్టిన బిడ్డ ఎవరికి కనిపించినా తన పరువు పోతుందనే ఉద్దేశంతో పసికందును చెత్తకుప్పలో పడేశానని చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం పోలీసులు ఆమె అన్నయ్యపై సెక్షన్ 375, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: