మహిళలపై రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఆడపిల్లలు కామపు కోరల్లో చిక్కుకుంటున్నారు . కనీసం బాలికలు  అని కూడా చూడకుండా కామంతో కళ్లు మూసుకుపోయి అతి దారుణంగా హత్యాచారాలు చేస్తున్నారు మృగాళ్లు . దిశ కేసులో నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేశాక కూడా ఇప్పటికీ ఆడపిల్లలపై అత్యాచారాలు ఎక్కడా తగ్గలేదు. రోజుకొకటి తెరమీదికి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన 63 ఏళ్ల మాజీ సర్పంచ్... బాలికపై అత్యాచారం చేశాడు. అసలు విషయం బయటపడడంతో మాజీ సర్పంచ్ కి దేహశుద్ధి చేశారు గ్రామస్తులు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం లో జరిగింది ఈ దారుణ ఘటన. 

 

 

 వివరాల్లోకి వెళితే... మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తన తండ్రికి ఫోన్ చేసుకునేందుకు మాజీ సర్పంచ్ కేతిరెడ్డి కోటిరెడ్డి ఇంటికి వెళ్ళింది. ఫోన్ మాట్లాడి ఇంటికి వెళ్తున్న బాలికను.. డబ్బులు ఇచ్చి మిరపకాయలు తీసుకురమ్మని దుకాణానికి పంపించాడు మాజీ సర్పంచ్ కోటిరెడ్డి. దుకాణానికి వెళ్లి మిరపకాయలు తీసుకువచ్చిన బాలికని ఇంటిలోకి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే కుమార్తె ఫోన్ చేసుకోడానికి వెళ్లి ఎంతకీ ఇంటికి  రాకపోవడంతో... ఆ బాలికను వెతుక్కుంటూ వెళ్ళినది  తల్లి. అదే సమయంలో మాజీ సర్పంచ్ కేతిరెడ్డి ఇంటి నుంచి కేకలు వినిపించడంతో...ఇంట్లోకి వెళ్లి చూసింది.  ఇక తల్లిని  చూసిన బాధితురాలు బోరున విలపిస్తూ జరిగిన విషయం తెలిపింది . 

 

 

 ఇక జరిగిన ఘటనతో ఆగ్రహావేశాలకు లోనైన కుటుంబ సభ్యులు గ్రామస్థులతో కలిసి మాజీ సర్పంచ్ ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అయితే గ్రామస్తుల నుంచి తప్పించుకొని మాజీ సర్పంచ్ కోటిరెడ్డి మరో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్న..  గ్రామస్తులు మాత్రం అతన్ని వదలలేదు. తలుపులు బద్దలు కొట్టి మరి అతని బయటికి లాకొచ్చి  చితక బాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా తనకి అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్తులు చితకబాదడం తో తీవ్ర గాయాలపాలైన అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: