బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లాయర్ పై చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో కాకరేపుతున్నాయి. ఆ లాయర్ ను నిర్భయ దోషులున్న జైల్లో పెట్టాలని హాట్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్టు సూటిగా చెప్పేస్తారు. పైగా ఆమె దేశంపై విపరీతమైన భక్తి కలిగి ఉండటంతో.. మాతృదేశంలో జరిగే దారుణాలపై ఎప్పుడూ పోరాట గళం వినిపిస్తూ ఉంటారు. పైగా తోటి నటీనటులు ఆమె పోరాటాలకు మద్దతు ప్రకటించకపోతే మరింత రగిలిపోతారు. అయితే నిర్భయ దోషులపై ఓ లాయర్ చేసిన కామెంట్స్ కంగనా రనౌత్ లో ఆగ్రహ జ్వాలలను పెంచేసింది. నిర్భయ నిందితులను ఫిబ్రవరి 1న తీహార్ జైల్లో ఉరితీయనున్నారు. 

 

సుప్రీం కోర్టుకు చెందిన సీనియర్ అడ్వొకేట్ ఇందిరా జైసింగ్.. నిర్భయ దోషుల గురించి ఆమె మాట్లాడిన మాటలు కంగనలో ఆవేశాలను పెంచేసింది. దేశం మొత్తం నిర్భయ నిందితులను చంపేయాలని డిమాండ్ చేస్తుంటే.. నిర్భయ తల్లి ఆ నలుగురిని క్షమించాలని ఇందిరా జైన్ కోరడాన్ని కంగనా తప్పుపట్టారు. అంతటి హోదా ఉన్న లాయర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై యావత్ భారత దేశం ఖంగుతినింది. అసలు ఇన్ని రోజులు ఆ దుర్మార్గులను జైల్లో పెట్టి మేపుతారా అంటూ కంగన నిలదీసింది. వాళ్లను కాల్చిపారేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. చివరకు ఉరికంబానికి దారులు సిద్ధం కావడంతో యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తుంటే.. ఇందిరా జైసింగ్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. 

 

ఓ అమ్మాయిని కర్కశంగా అత్యాచారం చేసిన చంపిన నీచులకు సపోర్ట్ ఇచ్చే ఇలాంటి మహిళలు రాక్షసులకు జన్మించిన వారిగా అభివర్ణించారు. ఇందిరా జైసింగ్ లాంటి వారే తమ పిల్లలను రాక్షసుల్లాగా పెంచి వారిలో క్రూరత్వాన్ని నింపుతారన్నారు.   


ఇందిరా జై సింగ్ ను నిర్భయ దోషులున్న కటకటాల్లో నాలుగు రోజు పెట్టి చూస్తే.. అప్పుడు ఆమె జ్ఞానోదయం అవుతుందని చెప్పుకొచ్చారు. నిర్భయ నిందితులను నాలుగు గోడల మధ్య జైల్లో ఉరి తీయడం కంటే.. బహిరంగంగా ఉరితీస్తే చాలా సంతోషిస్తానని కంగనా అంటోంది. అప్పుడే తప్పుడు చూపుతో చూసే మగవారిలో.. ఆడవారిపై చేయివేయలంటే వణుకు మొదలవుతుందని చెప్పుకొచ్చింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: