ఇటీవల హైదరాబాద్ లోని షాద్ నగర్ ప్రాంతం వద్ద గల తొండుపల్లి టోల్ గేట్ ఏరియా వద్ద యువ వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిని నలుగురు దుండగులు మాయమాటలు చెప్పి మోసంతో ఆమెను అటకాయించి ఆపై ఆమెపై అత్యాచారం చేసి ఘోరంగా చంపేసిన ఘటన దేశవ్యాప్తంగా ఎంతో కలకలం రేపింది. ఆ ఘటనపై అటు మహిళా, ప్రజా సంఘాలతో పాటు ప్రజలు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసారు. అయితే ఆ తరువాత నిందితులను 24 గంటలోపు పట్టుకున్న పోలీసులు, పది రోజుల తరువాత కేసు ఇన్వెస్టిగేషన్ నిమిత్తం వారిని ఒక ప్రాంతానికి తీసుకెళ్లిన పోలీసులు, హఠాత్తుగా వారు తమపై దాడి చేయడంతో పోలీసులు వారిని అక్కడికక్కడే కాల్చి చంపేయడం జరిగింది.

 

దానితో దేశం మొత్తం కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. అయితే ఆ ఘటన తరువాత అమ్మాయిలపై ఆ విధంగా తప్పుడు చర్యలు పాల్పడాలి అనుకునే వారిలో కొంతవరకు మార్పు వస్తుందని అందరూ భావించారు. అయితే మధ్యలో అక్కడక్కడా ఆడవారి పై అటువంటి ఘటనలు జరుగగా, నేడు సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో అచ్చంగా దిశా ఘటన మాదిరిగా జరిగిన ఉదంతం ఆ జిల్లా వాసులను ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురి చేసింది. ఇక వివరాల్లోకి వెళితే, అమీన్ పూర్ లో షాపుకు కిరానా వస్తువుల కొనుగోలు చేసేందుకు వచ్చిన ఒక బాలికను కొందరు దుండగులు మాయమాటలు చెప్పి కారులో ఎక్కించుకుని, దాదాపుగా 3 కిలోమీటర్లకు పైగా దూరం తీసుకెళ్లి ఒక నిర్మానుష్య ప్రాంతం వద్ద కారు ఆపి, ఆమెపై ఘోరంగా అత్యాచారం చేసారు. 

 

అయితే అప్పటికే ఆ ముగ్గురు కూడా ఫుల్ గా మద్యం సేవించి ఉన్నట్లు సమాచారం. కాగా షాప్ కి వెళ్లిన తమ కుమార్తె ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి షాప్ దగ్గర వెతికినా కూడా ఆమె కనపడకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె తల్లితండ్రులు వెంటనే 100 కి డయాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు స్వీకరించిన వెంటనే ఘటనా స్థలికి చేరుకొన్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు, అలానే ఘటన పై పూర్తి విచారణ చేపట్టారు. ఇక ఈ దారుణానికి ఒడిగట్టి తప్పించుకున్న ముగ్గురు నిందితులను అతి త్వరలో అరెస్ట్ చేస్తాం అని అంటున్నారు... !!

మరింత సమాచారం తెలుసుకోండి: