ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తననిర్ణయాలతో తానే ఉలికిపాటుకు గురవుతున్నా డని, తనచర్యలతో వింతపోకడలకు పోతున్నాడని టీడీపీ సీనియర్‌నేత, ఆపార్టీ పొలిట్‌బ్యూరోసభ్యులు వర్ల రామయ్య తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా ముక్తకంఠంతో జగన్‌ తీసుకున్న రాజధాని తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే, ఆయన మాత్రం తాననుకున్నదే జరగాలన్న ఉద్దేశంతో ప్రజలకు వ్యతిరేకంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడన్నారు. తమ రాజధానిని కాపాడుకోవడానికి ప్రజలం తా రేయింబవళ్లు, అవిశ్రాంతంగా పోరాడుతుంటే, వారిని ఓడించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ముకుల్‌రోహత్గీ అనే సుప్రీం న్యాయవాదిని తెరపైకి తీసుకొచ్చాడని వర్ల పేర్కొన్నారు. 

 

రాజధానిని కాపాడుకోవడానికి ప్రజలు, మేథావులు, ప్రజాసంఘాలు  హైకోర్టులో కేసులేస్తే, వాటిని అడ్డుకోవడానికి రూ.5కోట్ల ప్రజాధనం వెచ్చించిమరీ రోహత్గీని నియమించారన్నారు. ప్రజల ఆందోళనను, వారినిర్ణయాలను తొక్కిపెడుతూ,  ప్రజలను ఓడించడానికి, ప్రజలసొమ్మునే ఉపయోగించడం ఈరాష్ట్రంలోనే చూస్తున్నామ న్నారు.  జగన్‌తీసుకున్నది ప్రజారంజకనిర్ణయమే అయితే, ఢిల్లీనుంచి సుప్రీంన్యాయవా దిని పిలిపించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ప్రజలపై గెలవాలన్న ఉద్దేశంతో రూ. 5కోట్ల ప్రజధనం చెల్లించి, అదే ప్రజల్ని ఓడించాలని చూడటం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో అడ్వకేట్‌జనరల్‌ ఉండగా రోహత్గీని నియమించడం ఏమిటన్నారు. 

 

దేశంలో ఏ ప్రభుత్వంకూడా ఒకన్యాయవాదికి రూ.5కోట్లు ఇచ్చిన దాఖలాలు లేవని, ఆయనపై జగన్‌కు ఎందుకంత ప్రేమో సమాధానం చెప్పాలన్నారు.జగన్‌పై సీబీఐ వేసిన కేసులపై సుప్రీంకోర్టులో ఆయన తరుపునవాదిస్తున్న తన వ్యక్తిగత న్యాయవాది అయిన  ముకుల్‌ రోహత్గీని నియమించడం ఎంత వరకు సమంజసమని వర్ల ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో సీబీఐకి వ్యతిరేకంగా, జగన్‌కు అనుకూలంగా ముకుల్‌రోహత్గీ వాదించాడని వర్ల తెలిపారు. భవిష్యత్‌లో తనకుచెందిన కేసుల్నికూడా వాదించే ఒప్పందంతోనే, ఇప్పుడు రూ.5కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. జగన్‌ తనకేసులకోసం ప్రజాధనాన్ని వాడుకుం టున్నాడని, అందుకోసమే రోహత్గీకి రూ.5కోట్లు చెల్లించేలా జీవోలు ఇచ్చాడన్నారు. 

 

ఏం జరిగినా, ఎందరు చనిపోయినా, ఎందర్ని హింసించైనాసరే తాను నెగ్గవలిసిందే నన్న దుర్భుద్ధితోనే జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడన్నారు. ఒకవేళ ఈకేసులో జగన్‌  ఓడిపోతే, ప్రజలు కూడా ఓడిపోయినట్టేననే విషయాన్ని  ఆయన గ్రహించాలన్నారు.   శాసనమండలిలో తిష్టవేసిన 22మంది మంత్రులు, మందబలంతో ఛైర్మన్‌ను బెదిరించా రని, కులం-మతంపేరుతో ఆయన్ని దూషించారని రామయ్య మండిపడ్డారు. తామను కున్నది జరగలేదన్న అక్కసుతో విచక్షణకోల్పోయి నోటికొచ్చినట్లు మాట్లాడటం వారికే చెల్లిందన్నారు. శాసనసభలో ప్రతిపక్షసభ్యులు వెళ్తే, వారిని తప్పుపట్టిన ముఖ్యమంత్రి, సదరుసభ్యుల్ని ఎత్తిపడేయాలని చెప్పాడని, మండలిలో తనకేబినెట్‌మంత్రులుచేసిన దానికి వారినేం చేయాలో ఆయనే చెప్పాలన్నారు. 

 

ముఖ్యమంత్రి వ్యవహారశైలి వర్గపోరు ని పెంచేలా ఉందన్నారు. అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పేవరకు రాజధాని ఉద్యమం ఆగదని వర్ల తేల్చిచెప్పారు. ప్రతిశుక్రవారం కోర్టులో ముద్దాయిగా నిలబడే వ్యక్తి, రాష్ట్రహైకోర్టు ఎక్కడుండాలో నిర్ణయించడం సిగ్గుచేటన్నారు. 51 మంది మూర్ఖులు, పిచ్చివాళ్లు, అసమర్థులు పరిపాలిస్తుంటే, 49మంది మేధావులు చూస్తూకూర్చోవాల్సి వస్తుందన్న బెర్నార్డ్‌షా వ్యాఖ్యలకు రాష్ట్రంలోని పరిస్థితులు అద్దంపడుతున్నాయన్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: