2019 సార్వత్రిక ఎన్నికలకు గాను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల అవార్డులను ప్రకటించింది. ఈ సందర్భంగా దేశంలో ఏ రాష్ట్రానికి రాని అవార్డులు రెండు అవార్డులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినట్లు సమాచారం. 2019 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ బెస్ట్ స్టేట్ అవార్డు ను కైవసం చేసుకుంది. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ ప్రాంతంలో కూడా పోలింగ్ బూత్ లో ఎక్కడా కూడా అక్రమాలు అవకతవకలు అల్లర్లు ఇలాంటివి చోటుచేసుకోకుండా చాలా ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ నిర్వహించడంతో కేంద్ర ఎన్నికల సంఘం బెస్ట్ సీఈవో అవార్డు ప్రకటించడం జరిగింది. శనివారం ఢిల్లీలో అవార్డుల ప్రధాన కార్యక్రమం జరగనుంది.  దీంతో ఈ అవార్డులను స్వీకరించడానికి గోపాలకృష్ణ ద్వివేది ఢిల్లీకి బయలుదేరే అవకాశం ఉండటంతో ఏపీ లో ఉన్న కొంతమంది నేతలు ఆయన సత్కరించారు.

 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా పనిచేస్తున్న గోపాలకృష్ణ ద్వివేదీని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి అభినందించారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు బెదిరింపులకు భయపడకుండా నిజాయితీగా పనిచేసిన వ్యక్తి ద్వివేది అని నాగిరెడ్డి అన్నారు. ద్వివేదీపై అనవసర ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకొంటాడని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవహారశైలిలో ఏమాత్రం మార్పురాలేదని, శాసనమండలి చైర్మన్‌పై కూడా వత్తిడి తెచ్చి అభివృద్ధి బిల్లుకు ఆటంకం సృష్టించారని మండిపడ్డారు.

 

ఒత్తిడులకు తలొగ్గకుండా మీ నీతిగా నిజాయితీగా పనిచేసే అధికారులకు ఎప్పుడైనా గుర్తింపు ఉంటుందనడానికి ద్వివేదీ ఒక నిదర్శనమన్నారు. అప్పట్లో చంద్రబాబు అధికారంలో ఉండటంతో చాలాచోట్ల అడ్డదారులు తొక్కి ఎన్నికలలో వైసీపీ పార్టీ క్యాండెట్ లను అనేక విధాలుగా ఇబ్బందులపాలు చేయాలని చూసినా గాని కేంద్ర ఎన్నికల సంఘం అధికారి రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ద్వివేదీ ఎక్కడికక్కడ పకడ్బందీ చర్యలు చేపట్టడం జరిగిందని..అంతేకాకుండా వైసీపీ పార్టీకి చెందిన ఓటర్ల పేర్లను కూడా లేకుండా చేయాలని చంద్రబాబు వేసిన ప్రతి ప్లాన్లు తలకిందులయ్యాయి అంటే దానికి కారణం ద్వివేదీ అంటూ చాలామంది ఏపీ నేతలు ఆయనకు అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: