ఆడపిల్లలపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఆడపిల్లలపై అత్యాచారాలు చేసే వారిని శిక్షించడానికి ఎన్ని కఠిన చట్టాలు వచ్చినప్పటికీ కామందుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. అత్యాచారాలు హత్యలు చేయడానికి కనీసం వెనకడుగు వేయడం లేదు. దిశ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపిన... నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఉరిశిక్ష అమలు చేసిన వారిలో మార్పు మాత్రం రావడం లేదు. కొంచమైన భయం కనిపించడం లేదు. తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఒక మైనర్ బాలికపై ముగ్గురు దుండగులు అతి దారుణంగా అత్యాచారం చేశారు. మధ్యాహ్న సమయంలో దుకాణానికి వెళ్లిన బాలికను ముగ్గురు దుండగులు కారులో కిడ్నాప్ చేసి.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచార ప్రయత్నం చేశారు. 

 

 

అయితే బాలిక గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకోగానే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యారు. కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు డయల్ 100 కి కాల్ చేయడంతో పోలీసులు కూడా యువతి ఫోన్ సిగ్నల్ ఆధారంగా సరైన సమయానికి ఘటనాస్థలికి చేరుకొని బాలికను రక్షించారు. అయితే తెలంగాణలో దిశ కేసులోని నలుగురు నిందితులను పోలీసులు అతి దారుణంగా ఎన్కౌంటర్ చేసి చంపినప్పటికీ... ఇక తాజాగా నిర్భయ దోషులకు కూడా ఉరి  విధించినప్పటికీ కూడా..కామంతో  కళ్ళు మూసుకుపోయిన మృగాల్లాంటి  మగాళ్ళు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. 

 

 

 మహిళలపై అత్యాచారం చేస్తే కఠిన శిక్షలు పడతాయని కొంచెం అయినా భయం కనిపించడంలేదు. ఆడపిల్ల కనిపిస్తే చాలు కామంతో ఓడిపోయే అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు తాజా ఘటన  ఇందుకు నిదర్శనం. సరైన సమయానికి పోలీసులు వచ్చారు కాబట్టి యువతి ప్రాణాలతో బయట పడింది లేకపోతే... మద్యం మత్తులో కామంతో ఊగిపోతున్న మృగాళ్లు ఆ బాలిక ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం పోయేవారు. కాగా  బాలిక తెలిపిన వివరాలతో  పోలీసులు నిందితుల ఆచూకీ వెతుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: