నిర్భ‌య ఘ‌ట‌న యావ‌త్ భార‌త‌దేశాన్ని షాక్‌కు గురి చేసిన విష‌యం తెలిసిందే. డిసెంబర్‌ 16, 2012 అర్ధరాత్రి దేశరాజధాని అయిన ఢిల్లీలో  23 ఏళ్ల వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేయటంతోపాటు అత్యంత పాశవికంగా వ్యవహరించిన ఘ‌ట‌న తెలిసిందే.  ఉన్మాదంగా బాధితురాలిని సుఖాన్ని అనుభవించే వస్తువుగానే పరిగణించారు.అత్యంత కిరాతకం.. డిసెంబర్‌ 16, 2012 నాటి ఘటనలో దోషుల చేతిలో బాధితురాలు అనుభవించిన ప్రత్యక్ష నరకాన్ని.. రక్తంతో తడిచిన ప్రతి క్షణం అంద‌రి క‌ళ్ళ ముందు ఇంకా క‌ద‌లాడుతూనే ఉంది. సామూహిక అత్యాచారం తర్వాత ఆమె జననాంగంలోకి ఇనుపరాడ్డును చొప్పించి అత్యంత పాశవికంగా వ్యవహరించారు ఆ దుర్మార్గులు. ఇక ఈ ఘ‌ట‌న‌లో నిర్భయ దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయడానికి తీహార్ జైల్లో ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. 

 

ఇక ఇదిలా ఉంటే ఇటీవ‌లె జ‌రిగిన దిశ ఘ‌ట‌న గురించి తెలిసిందే. ఎంతో అమానుష్యంగా దుండ‌గులు చేసిన ఈ ఘ‌ట‌న గురించి తెలిసిన విష‌య‌మే. ఈ ఘ‌ట‌న త‌ర్వాత నిందితుల‌ను పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేశారు. ఇలాంటి ఘ‌ట‌న త‌ర్వాత మ‌ళ్ళీ మృగాళ్ళు ఆడ‌వాళ్ళ జోలికి వెళ్ళ‌రు అనుకుంటే... పొర‌ప‌డిన‌ట్లే. సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు అమీన్ పూర్‌లో 16 ఏళ్ళ బాలిక పై ముగ్గురు గుర్తు తెలియ‌ని మృగాళ్ళు అత్యాచార ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డారు. స‌రుకుల కోసం బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకుని నిర్మానుష్య స్థ‌లానికి తీసుకెళ్లి ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డారు. ఆమె ఫోన్ ద్వారా త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం ఇచ్చింది. 

 

ఇలాంటి ఎంత పెద్ద పెద్ద శిక్ష‌లు విధించినా కూడా ఆక‌తాయిల ఆగ‌డాలు మాత్రం ఆగ‌డం లేదు. ఆడ‌పిల్ల బ‌య‌ట‌కు వెళితే తిరిగి ఇంటికి వ‌చ్చేవ‌రకు కూడా త‌ల్లిదండ్రుల గుండెల్లో రైళ్ళు ప‌రిగెడుతున్నాయి. శిక్ష‌లు ఎంత క‌ఠినంగా ఉన్నా మృగాళ్ళ‌లో మాత్రం భ‌య‌మ‌నేది రావ‌డం లేదు.  ఇక మైన‌ర్  బాలిక పై విరుచుకుప‌డ్డ ఈ అఘాంత‌కుల‌కు కూడా స‌జ్జ‌నార్ మ‌ర్క్ శిక్షే విధించాలి. ఇలాంటి ఘ‌ట‌న‌లు అన్నీ చూస్తుంటే చాలా మంది త‌ల్లిదండ్రులు ఆడ‌పిల్ల‌ల‌ను క‌నాల‌న్నా భ‌య‌ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: