వివాదాస్పద పాకిస్థాన్ బౌలర్ షోయబ్ అక్తర్ ఎక్కువగా వివాదాలకు కేంద్రబిందువుగా మారుతాడు అన్న విషయం తెలిసిందే. క్రికెట్ మైదానంలో అయితే ఇతను వేసే బౌలింగ్ పై ఎన్నో సార్లు అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఇక వివాదాల విషయానికి వస్తే క్రికెట్ చరిత్రలో దాదాపుగా ఇతను లేవనెత్తినన్ని వివాదాలు, ఆరోపణలు, బహుశా ఏ క్రికెట్ ఆటగాడిపైన రాలేదు.
అయితే ప్రస్తుతం ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న ఈ రావల్పిండి ఎక్స్ ప్రెస్, గత కొంత కాలంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు.. ఆ యాక్టివ్నేస్ వల్లనేమో గాని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.. ఇకపోతే ఎప్పుడో అంటే 2016 లో ఓ ఇంటర్య్వూలో షోయబ్ అక్తర్ గురించి వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడిన మాటలకు ఇప్పుడు స్పందిస్తూ సంచలన వాఖ్యలు చేశాడు.
ఇంతకు ఏం జరిగిందంటే వీరేంద్ర సెహ్వాగ్, షోయబ్ అక్తర్ ను ఉద్దేశించి. భారతీయులకి దగ్గరయ్యేందుకు షోయబ్ అక్తర్ చాలా ప్రయత్నిస్తున్నాడని, అతను తన వ్యాపార సామ్రాజ్యాన్ని భారత్లో విస్తరింప చేయాలని అనుకున్నాడు కాబట్టి ఇందులో భాగంగా టీమిండియాను భారత క్రికెటర్లను పొగుడుతున్నాడని, అంతే కాకుండా గత కొన్నిరోజులుగా అతను భారత్తో స్నేహపూర్వక ధోరణిలో మాట్లాడటానికి చేస్తున్న ప్రయత్నం ఇందుకోసం అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
అయితే ఇది జరిగిన నాలుగు సంవత్సరాల తర్వాత ఈ విషయం పై అక్తర్ స్పందిస్తూ, నీ తలపై ఉన్న వెంట్రుకల కన్నా నా వద్ద డబ్బు ఎక్కువే ఉంది. అని ఎప్పుడో 2016లో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు కౌంటర్ ఇచ్చాడు.. ఇకపోతే క్రికెట్ ఆడే రోజుల్లో వీరిద్దరు మైదానంలో పోటీపోటిగా తలపడినప్పటికి ఎప్పడూ హద్దులు మీరలేదు.
ఓ మ్యాచ్లో అక్తర్ పట్టుజారి కిందపడిపోగా సెహ్వాగ్ చేయి అందించి అతడ్ని పైకి లేపిన తీరుకు అందరు ఆశ్చర్య పోయారట. ఆటలో పోటీ ఉండాలే కానీ, మనుషుల మద్య విబేధాలు ఉండకుండా ఇలా స్నేహపూర్వకంగా ఉండాలని అనుకున్నారట కూడా. మరి ఇలాంటి పరిస్దితులో అక్తర్ చేసిన వాఖ్యలు సెహ్వాగ్ ఎలా స్వీకరిస్తాడో చూడాలి..