వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడును ఓ ఆటాడుకుంటున్నాడు. ట్విట్టర్లో తాజాగా చేసిన ట్వీట్లో  చంద్రబాబు, యనమల, లోకేష్ ముగ్గురిని కలిపి దుమ్ము దులిపేశాడు. శాసనమండలి రద్దు చర్చల నేపధ్యంలో దివంగత నేత ఎన్టీయార్ కు ముడిపెట్టి మరీ వాయించేశాడు.

 

అసెంబ్లీలో పాసైన రెండు బిల్లులను శాసనమండలిలో అప్రజాస్వామికంగా, నిబంధనలకు విరుద్ధంగా అడ్డుకోవటంపై మండిపడ్డారు.  చంద్రబాబు అహంకార ధోరణి వల్లే ఇపుడు మండలి ఉనికికే ప్రమాదం ముంచుకొచ్చిందంటూ చెడుగుడు ఆడేశాడు. అసెంబ్లీలో స్పీకర్ గా ఉన్నపుడు అప్పట్లో ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచిన యనమల ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు చేసిన సేవలను గుర్తుచేశారు.

 

చంద్రబాబు, యనమల కలిసి చేసిన కుట్రలను పైన ఉన్న ఎన్టీయార్ అంతా చూస్తున్నట్లు విజయసాయి ఎద్దేవా చేశారు. శాసనమండలి ప్రతిష్టను చంద్రబాబు, యనమల స్వార్ధ ప్రయోజనాల కోసం గబ్బు పట్టించేసినట్లు దుయ్యబట్టారు. అహంకారంతో , దుర్భుద్దితో చంద్రబాబు వేసిన అడుగుల వల్ల  టిడిపితో పాటు పార్టీని నమ్ముకున్న నేతలను అదఃపాతాళానికి తొక్కేస్తున్నట్లు మండిపోయారు.

 

ఈ వయస్సులో కూడా చంద్రబాబు తన శక్తికి మించి చేస్తున్న విన్యాసాల వల్ల కొడుకు పప్పునాయుడు రాజకీయ జీవితం కూడా ముగిసినట్లే అంటూ విజయసాయి ఎగతాళి చేయటం సంచలనంగా మారింది. యనమల లాంటి నేతలకు రాజకీయ జీవితం క్లైమాక్స్ యాంటి క్లైమ్యాక్స్ గా ముగుస్తుండటాన్ని కూడా ఎంపి ప్రస్తావించారు. చంద్రబాబు, యనమల, లోకేష్ చేసిన తప్పుటడుగులు పార్టీ నేతలకు ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుందంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

 

నిజానికి చంద్రబాబు, యనమల, లోకేష్ లన టార్గెట్ గా చేసుకుని విజయసాయి చేసిన ట్వీట్ ఇదే మొదటికాదు. వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి పై ముగ్గురిని టార్గెట్ చేసుకుని ట్విట్టర్లో ఎంపి రెచ్చి పోతున్నారు. కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ఎక్కువయ్యిందంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: