దేశంలో ప్రతిరోజూ ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు తమ కోరిక తీర్చుకున్న తర్వాత దారుణంగా హత్యలకు పాల్పపడుతున్నారు.  మరో ఘోరమైన విషయం ఏంటేంటే... చిన్నారులపై అత్యాచారాలు చేసి వారిని కృరంగా చంపేస్తున్నారు.  ఈ మద్య దిశ కేసులో ఎన్ కౌంటర్ జరిగినా కొంత మంది కామాంధుల్లో మాత్రం భయం అనేది కనిపించకుండా ఉంది. తాజాగా ప్రేమోన్మాదం మరో బాలికను బలితీసింది. చిలకలగూడ పరిధి వారాసిగూడలో రెండు అపార్ట్ మెంట్ల మధ్య విగతజీవిగా పడివున్న బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మైనర్ బాలికను గుర్తు తెలియని వ్యక్తులు అపార్ట్ మెంట్ పై నుంచి తోసేసి హత్య చేసినట్టు తెలుస్తోంది. బాలిక పై అత్యాచారం జరిపి ఆ తర్వాత ఆ వ్యక్తులు బాలికను బిల్డింగ్ నుంచి కిందకు తోసేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

పోలీసులు, స్థానికుల కథనం మేరకు...వారాసిగూడలోని ఓ అపార్ట్ మెంట్లో ఈ బాలిక తల్లి, తమ్ముడు, సోదరితో కలిసి ఉంటోంది. ఈ మద్య ఆ బాలిక తండ్రి మరణించారు.  పెద్ద దిక్కులేకుండా జీవిస్తున్ ఆ కుటుంబంపై షోయబ్ అనే కుర్రాడు కన్నేశాడు.  ఆ బాలికను ఎలాగైనా అనుభవించిన తనదానిని చేసుకోవాలనే కోరికతో ఉన్నాడు.  ఈ నేపథ్యంలో తన తల్లిదండ్రులను ఆ కుటుంబాన్ని కలిసి పెళ్లి విషయం గురించి మాట్లాడమన్నాడు. కానీ ఆ బాలిక తల్లి తను ఇంకా మైనర్ అని.. పెద్ద చదువులు చదవాలని చెప్పడంతో ఆ కుటుంబంపై కసి పెంచుకున్నాడు.  ఈ నేపథ్యంలో నిన్న రాత్రి చదువుకునేందుకని బాలిక టెర్రస్ పైకి వెళ్లి, ఎంతకీ తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు టెర్రస్ పైన, చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం కనిపించలేదు. 

 

కాగా, ఈ ఉదయం ఓ మహిళ టెర్రాస్ పైన రక్తపు మరకలు చూసి వెంటనే స్థానికులకు తెలిపింది. అక్కడికి చేరుకున్న వారు పక్కన  తొంగిచూడగా రెండు భవనాల మధ్య పడివున్న బాలిక కనిపించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు భోరుమన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు.  పోలీసులు బాలికను పై నుంచి కిందికి తోసేసే ముందు ఆమెను తీవ్రంగా హింసించారని, అత్యాచారం కూడా చేసి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: