మనం ఈ ఘటనను ఇది వరకే సినిమాలో చూశాం.. ఎక్కడ ఏ సినిమా అంటే.. సూర్య.. తమన్నా కలిసి నటించిన వీడోక్కడే సినిమాలో హెరాయిన్ ను కడుపులో దాచుకొని విదేశాలకు తరలిస్తుంటారు. అలానే ఇప్పుడు కూడా ఓ వ్యక్తి బంగారాన్ని కడుపులో దాచుకొని వచ్చాడు. అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా?
సాధ్యం అవుతుంది అండి.. మనిషి తలుచుకుంటే ఏమైనా అవుతుంది.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న రాత్రి కోటిన్నర రూపాయలకు పైగా విలువైన బంగారాన్ని తరలిస్తూ నలుగురు వేరు వేరు ప్రయాణికులు పట్టుబడ్డారు. ఏకంగా 4కిలోల బంగారం పట్టుబడింది. దుబాయ్, మస్కట్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి 4 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఆలా తరలిస్తున్నారు ప్రయాణికులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దుబాయ్, మస్కట్ నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు బంగారంను గుళికలు.. పేస్ట్ రూపంలో మర్చి కడుపులో దాచుకొని వచ్చారు.
అయితే.. వారి కడుపులో బంగారం ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. శస్త్ర చికిత్స చేయించి, 928 గ్రాముల బంగారాన్ని బయటకు తీశారు. అయితే విల్లు బంగారంను కడుపులో పెట్టుకోగా.. దుబాయ్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడు 840.98 గ్రాముల బంగారాన్ని నల్లరంగు టేపులో చుట్టి తీసుకురాగా అతన్ని గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు.
మస్కట్ నుంచి వచ్చిన ఇంకో ప్రయాణికుడు మైక్రోవేవ్ ఓవెన్లో 700 గ్రాముల బంగారాన్ని తీసుకొస్తుండగా.. పట్టుకున్నారు. ఇలా నలుగురు ప్రయాణికుల వద్ద నుండి 4 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు పోలీసులు. కాగా వీడోక్కడే సిన్ ని తలిపించిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలకోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.