మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఓట్ల కౌంటింగ్ రోజు రానే వచ్చింది.తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈనెల 22న జరగగా...  నేడు ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతోంది.80 నియోజకవర్గాల్లో 120 మున్సిపాలిటీలు 9 కార్పొరేషన్లకు జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అధికారులు ప్రారంభించారు. మొత్తంగా 12 వేలకు పైగా అభ్యర్థులు ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తారు. కాగా ఈ అభ్యర్థులందరి భవితవ్యం ఏమిటో నేడు తేలిపోనుంది. ఇక పోలీసులు పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికల కౌంటింగ్ ప్రారంభించారు అధికారులు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 

 

 

 అయితే ఈ ఎన్నికల ఫలితాలపై అటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కాకుండా ఆయా పార్టీ అధిష్టానం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇటీవలే దావోస్ పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ పర్యటన ముగించుకుని శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇక నేడు మున్సిపల్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో... మంత్రి కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుందని అన్ని రిపోర్టులు  చెబుతున్నాయని... మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై పూర్తి ధీమాతో  ఉన్నట్లు కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు .

 

 

 అయితే కేసీఆర్ చేసిన ట్వీట్ పై స్పందించిన అనిల్  ఆర్యన్ అనే ఓ నెటిజన్... ఆసక్తికరంగా స్పందించాడు. డబ్బులు పంచారు  కదా ఎందుకు గెలువరు సారూ  అంటూ... కేటీఆర్ పెట్టిన ట్వీట్ కు అనిల్ ఆర్యన్  అనే నెటిజన్ రిప్లై పెట్టాడు. దీంతో నీకు ఎంత ముట్టింది అంటూ మరో నెటిజన్ అతన్ని  ప్రశ్నించగా... తమ కుటుంబంలోని నలుగురు సభ్యులకు టిఆర్ఎస్ నుంచి 8000 సిపిఎం నుంచి నాలుగు వేల రూపాయలు ముట్టాయి  అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ నెటిజన్ చేసిన కామెంట్ లో ఎంత వాస్తవమో తెలియకపోయినప్పటికీ ప్రస్తుతం కామెంట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: