ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మోత్కూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు నరాలు తెగే ఉత్కంఠ తో రీ కౌంటింగ్ ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు . ఈ వార్డు టీఆరెస్ గెలిస్తే ఆ పార్టీకి చైర్మన్ పదవి దక్కే అవకాశముండగా , కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే మాత్రం హంగ్ ఏర్పడనుంది .
మొత్తం 12 వార్డులున్న మోత్కురు మున్సిపాలిటీలో టీఆరెస్ ఆరు వార్డుల్లో గెలిచి ఆధిక్యం లో కొనసాగగా , కాంగ్రెస్ పార్టీ సైతం తామేమి తక్కువకాదన్నట్లుగా ఐదు వార్డులను సొంతం చేసుకుని , అధికార పార్టీ నేతలకు గట్టి షాక్ ఇచ్చింది . అయితే మున్సిపాలిటీ లోని ఏడో వార్డులో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చాయి. దీంతో ఏడో వార్డులో రీ కౌంటింగ్ చేయాలని ఎన్నికల అధికారులను ఇరు పార్టీల అభ్యర్థులు కోరారు . రీ కౌంటింగ్ లోను ఇద్దరికి సమన ఓట్లు వేస్తే, ఫలితాన్ని టాస్ , డ్రా ద్వారా నిర్ణయించే అవకాశాలున్నాయి . ఏడవ వార్డు ఈ ఫలితాన్ని బట్టి.. మోత్కుర్ మున్సిపల్ పీఠం ఎవరిదన్న విషయం తెలియనుంది.
ఒక వేళ ఏడవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే , అప్పుడు చైర్మన్ పీఠం కోసం రెండు పార్టీలు లాటరీ ఫలితం కోసం ఎదురుచూడాల్సిందేనని పరిశీలకులు అంటున్నారు . ఏడవ వార్డులో ఒక్క ఓటు టీఆర్ఎస్కు వస్తే ఆ పార్టీకే వార్డు తోపాటు , మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కేది. మోత్కుర్ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుందుకు అధికార పార్టీ నేతలు అప్పుడే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది . ఏడవ వార్డు గెలిస్తే సరేసరి అని లేకపోతే, కాంగ్రెస్ తరుపున ఒక్కర్ని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం .