వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ తెలుగు దేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ లో ప్రతి రోజు ఏదొక విషయంపై స్పందించి ప్రతిపక్షాల పార్టీ నాయకులకు ఝలక్ లు ఇస్తుంటాడు విజయసాయి రెడ్డి. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులు దేవినేని ఉమా ఓపిక పట్టాలని ఎంత దోచుకున్నది.. ఎంత పోగేసుకున్నది అంత బయట పడుతుంది అని హెచ్చరించారు విజయసాయి రెడ్డి.  

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ ''ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నువ్వెంత దోచుకున్నది, ఇసుక మాఫియా ద్వారా ఎన్ని వేల కోట్లు పోగేసుకున్నది తొందర్లోనే బయట పడుతుంది. కాస్త ఓపిక పట్టు ఉమా. మ్యావ్ మ్యావ్ లు ఆపేయ్. నువ్వెంత గొంతు చించుకున్నా సింహంలా గర్జించ లేవు. ప్రాణాలు తీసిన హంతకుడివి. నువు నీతులు వల్లిస్తే ఎలా?'' అంటూ ట్విట్ చేసి దేవినేని ఉమకు ఝలక్ ఇచ్చాడు విజయసాయి రెడ్డి. 

 

ఈ ట్విట్ పై నెటిజన్లు స్పందిస్తూ ' మంచి నిర్ణయం సార్ 'గత 5 సంవత్సరాలలో దోచుకున్నది అంత బయట పెట్టండి సార్. ప్రజలకు అన్ని తెలియాలి, వాళ్లకు యెల్లో మీడియా ఉంది. అందులో అన్ని అబద్దాలు చూపిస్తున్నారు. కొన్ని ఛానళ్లలో టీడీపీ వాళ్లతో డిబెట్స్ పెట్టి తప్పుడు వార్తలన్నీ ప్రజలకు చూపిస్తున్నారు. మీరు యాక్షన్ తీసుకోండి సర్' అంటూ ట్విట్ పెట్టి పచ్చ ఛానళ్లపై తెలుగు దేశం పార్టీ నేతలపై మండిపడుతున్నారు నెటిజన్లు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: