చంద్రబాబు నాయుడుని ఏకిపారేసింది ఆ ఎమ్మెల్సీ.. చంద్రబాబు తీరులో కొద్దిగా కూడా మార్పు రాలేదు అని.. ఎమ్మెల్సీ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాటలు విన్న పచ్చ తమ్ముళ్లు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.. చంద్రబాబు శాసనమండలి గ్యాలరీలో కూర్చొని ఏం చేశారు అనేది ఆమె పూస గుచ్చినట్టు చెప్పారు. 

                        

                                         

అసలు వివరాల్లోకి వెళ్తే.. నేడు సీఎం జగన్ ను ఎమ్మల్సీ సునీత ఆమె భర్త సురేష్ కలిశారు. వారు మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పుకొచ్చారు. కాగా ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తుంది అని.. అభివృద్ది కార్యక్రమాలకు ఆమె మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. 

 

అంతేకాదు.. చీరాల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎం జగన్ ను కలిశారు.. ఈ నేపథ్యంలోనే ఆమె బాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనమండలి గ్యాలరీలో కూర్చుని చైర్మన్‌ షరీఫ్‌కు సైగలు చేస్తూ సభను పక్కదారి పట్టించారని ఆమె ఆరోపించారు. శాసనమండలిని కూడా టీడీపీ రాజకీయ వేదికగా మార్చేసిందని ఆమె మండిపడ్డారు. 

 

చంద్రబాబుకు మండలి గ్యాలరీలోకి ఎందుకు వచ్చారని.. రావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. కాగా శాసనమండలిలో ఛైర్మన్ నిబంధనలు పాటించకుండా వికేంద్రీకరణ బిల్లుపై తీసుకున్న నిర్ణయం చరిత్రలో ఓ మచ్చగా మిగిలిపోతుంది అని అన్నారు. మండలి చైర్మన్‌ పూర్తిగా తప్పు చేశారని, ఆయన చరిత్ర హీనులుగా మిగిలిపోతారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: