మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి గులాబీ పార్టీ సత్తా చాటింది. తెలంగాణలో తనకు ఎదురు లేదని మరోసారి నిరూపించింది. 120కి మున్సిపాలిటీల్లో 108 వరకూ గెలచుకుని తనకు సాటి లేరని తేల్చి చెప్పింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, బీజేపీ సింగిల్ డిజిట్ కు పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో గెలుపుతో మరింత జోష్ లో ఉన్న కేసీఆర్ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు.

 

ఉద్యోగుల పదవీ విరమణను పెంచుతానని కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చిన సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో వివరించారు. ఈ ప్రకటన ఉద్యోగుల్లో ఆనందం నింపింది. పదవీ కాలం రెండు ఏళ్లు పెరిగినా ఉద్యోగులకు ఎంతో సంతోషం ఇస్తుంది. దీని వల్ల వారు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఏ ఉద్యోగికైనా పదవీ కాలం చివర్లో అత్యధిక వేతనం వస్తుందన్న సంగతి తెలిసిందే. ఆ చివరి జీతం మరో రెండేళ్లు వస్తుందంటే ఎంత ఊరట కలుగుతుందో చెప్పనక్కర్లేదు కదా.

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి ఘనవిజయం ఏ పార్టీకి దొరకదని, ఇది మామూలు విషయం కాదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. పట్టణ ప్రాంతాల్లో భిన్నమైన ఓటర్లు ఉంటారని, వారు కూడా ఈసారి ఏకపక్షంగా ఓట్లేశారని సీఎం కేసీఆర్ తెలిపారు. డిసెంబరులో తాను అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళుతుంటే అనేక వ్యాఖ్యలు చేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. కానీ 88 సీట్లు గెలిచామని సీఎం కేసీఆర్ తెలిపారు.

 

ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో తమను అడ్డుకునేందుకు ప్రత్యర్థులు విశ్వప్రయత్నాలు చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. కోర్టుల చుట్టూ తిరిగారని ఆరోపించారు. ఎన్నికలు పూర్తయితే అభివృద్ధి పనులు కొనసాగించవచ్చని తాము భావిస్తే, ఎలాగైనా ఎన్నికలు ఆపాలని విపక్షాలు పనిచేశాయని కేసీఆర్ మండిపడ్డారు. అనేక అవాంతరాలను అధిగమించి జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు ముక్తకంఠంతో తీర్పు చెప్పారని కేసీఆర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: