విజయసాయి రెడ్డి... ఎప్పుడు ఏదో ఒక విషయంపై సోషల్ మీడియాలో ఫైర్ అవుతుంటారు.. వైసీపీ ప్రధాన కార్యదర్శి అయినా విజయసాయి రెడ్డి.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ప్రతిపక్షాలు చేసే చిల్లర ఆరోపణలపై ఘాటుగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై మండిపడ్డారు విజయసాయి రెడ్డి. ఈ మేరకు ట్విట్టేర్ వేధికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

           

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. ''పూల ఖర్చు వృథా అయినట్టేనా? కౌన్సిల్ లో ఏదో సాధించాడని పూల వర్షం కురిపించిన వారంతా తల పట్టుకుంటున్నారట. రాజధాని సంగతి దేవుడెరుగు. కౌన్సిల్ కు ఎసరు పెట్టాడని సొంత పార్టీ వాళ్లే పిడకలు విసురుతున్నారు. ఒకేసారి అన్ని దిక్కుల నుంచి సుడిగాలి చుట్టముట్టిందేమిటి విజనరీ?'' అంటూ ట్విట్ చేసి చంద్రబాబుపై సెటైర్లు వేశాడు విజయసాయి రెడ్డి.

        

దీంతో ఈ ట్విట్లు ఉదయం నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ట్విట్ల కారణంగా ఆంధ్ర రాజకీయ నాయకుల మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే నడిచింది. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ఆంధ్ర రాజకీయాలు చాలా వేడి వేడిగా ఉన్నాయి.. ఎప్పుడు ఏలాంటి మలుపు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. 

          

మరింత సమాచారం తెలుసుకోండి: